‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడు సతీశ్ వేగేశ్న ఎంత మంచి పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాలతో పోటీ పడి ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే అందుకున్న ఆ చిత్రం.. జాతీయ అవార్డు సైతం అందుకుంది.
ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు మూడేళ్లు తిరిగేసరికి రెండు పేలవమైన సినిమాలతో తెచ్చుకున్న పేరంతా పోగొట్టుకున్నాడు. ‘శతమానం భవతి’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ మరో ‘బ్రహ్మోత్సవం’లా అనిపిస్తే.. ఆ తర్వాత వచ్చిన ‘ఎంతమంచివాడవురా’ ప్రేక్షకులను టార్చర్ పెట్టేసింది.
‘శతమానం భవతి’ కంటే ముందు సతీశ్.. రామదండు, దొంగలబండి అనే సినిమాలు తీశాడు. అవి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ‘శతమానం భవతి’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా తర్వాత ట్రాక్ తప్పాడు. చివరికిప్పుడు తన కొడుకు సమీర్ వేగేశ్న, ‘రాజ్దూత్’తో పరిచయమైన శ్రీహరి కొడుకు మేఘాంశ్లను హీరోలుగా పెట్టి ఏదో కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నట్లు మీడియాకు వెల్లడించాడు. ఈ సినిమాపై జనాల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుందన్నది సందేహమే.
‘శతమానం’ భవతితో స్టార్ డైరెక్టర్ అయిపోతాడని.. స్టార్లను డీల్ చేస్తాడని అనుకుంటే.. ఇలాంటి స్థితికి వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం, ఆ తర్వాత అంచనాలు అందుకోవడం కష్టం అనడానికి సతీశ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉండగా సతీశ్ నిర్మాతగా మారి అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘నాంది’ కొంత ఆశలు రేకెత్తిస్తోంది.
This post was last modified on August 16, 2020 4:43 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…