Movie News

ఆ దర్శకుడిది ఒక సినిమా మెరుపేనా?

‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడు సతీశ్ వేగేశ్న ఎంత మంచి పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాలతో పోటీ పడి ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే అందుకున్న ఆ చిత్రం.. జాతీయ అవార్డు సైతం అందుకుంది.

ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు మూడేళ్లు తిరిగేసరికి రెండు పేలవమైన సినిమాలతో తెచ్చుకున్న పేరంతా పోగొట్టుకున్నాడు. ‘శతమానం భవతి’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ మరో ‘బ్రహ్మోత్సవం’లా అనిపిస్తే.. ఆ తర్వాత వచ్చిన ‘ఎంతమంచివాడవురా’ ప్రేక్షకులను టార్చర్ పెట్టేసింది.

‘శతమానం భవతి’ కంటే ముందు సతీశ్.. రామదండు, దొంగలబండి అనే సినిమాలు తీశాడు. అవి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ‘శతమానం భవతి’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా తర్వాత ట్రాక్ తప్పాడు. చివరికిప్పుడు తన కొడుకు సమీర్ వేగేశ్న, ‘రాజ్‌దూత్’తో పరిచయమైన శ్రీహరి కొడుకు మేఘాంశ్‌లను హీరోలుగా పెట్టి ఏదో కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నట్లు మీడియాకు వెల్లడించాడు. ఈ సినిమాపై జనాల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుందన్నది సందేహమే.

‘శతమానం’ భవతితో స్టార్ డైరెక్టర్ అయిపోతాడని.. స్టార్లను డీల్ చేస్తాడని అనుకుంటే.. ఇలాంటి స్థితికి వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం, ఆ తర్వాత అంచనాలు అందుకోవడం కష్టం అనడానికి సతీశ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉండగా సతీశ్ నిర్మాతగా మారి అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘నాంది’ కొంత ఆశలు రేకెత్తిస్తోంది.

This post was last modified on August 16, 2020 4:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

32 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

2 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

2 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

3 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

3 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 hours ago