జవాన్ సినిమా విషయంలో షారుఖ్ ఖాన్ తగ్గేదేలే అంటున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. వచ్చే నెల ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. అందులో భాగంగా జిందా బందా అంటూ సాగే మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేస్తారు. దీని వెనుక చాలా విశేషాలున్నాయి. ఆరు రాష్ట్రాల నుంచి పిలిపించిన 1000కి పైగా లేడీ డాన్సర్లతో హీరో ఇంట్రో సాంగ్ గా చిత్రీకరించారు. శోభి డాన్స్ డైరెక్షన్ చేయగా అయిదు రోజుల పాటు చెన్నైలో షూట్ చేశారు. దీనికి అయిన ఖర్చు అక్షరాలా 15 కోట్ల రూపాయలు.
కింగ్ ఖాన్ కెరీర్లోనే ఇది అత్యంత ఖరీదైన పాటగా యూనిట్ చెబుతున్నారు. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన అదిరిపోయే పాటకు షారుఖ్ వేసిన స్టెప్పులు ఆశ్చర్యపరుస్తాయట. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మధురై నుంచి ప్రత్యేకంగా పిలిపించిన లేడీ డాన్సర్లని చూసి మాస్ కి మతులు పోవడం ఖాయమని అంటున్నారు ఈ ఒక్క పాటకు పెట్టిన డబ్బుతో ఓ మీడియం రేంజ్ సినిమానే తీయొచ్చు. అలాంటిది ఇంత బడ్జెట్ అంటే మాటలు కాదు. అయితే బిజినెస్ పరంగా హక్కులు విక్రయించి ఎప్పుడో విపరీత లాభాలు అందుకున్న రెడ్ చిల్లీస్ బ్యానర్ పబ్లిసిటీని ఓ రేంజ్ లో చేయబోతోంది.
ఇంత హడావిడి జరిగే పాటలో హీరోయిన్లు నయనతార, దీపీకా పదుకునే ఉండరట. ఇదో ప్రత్యేకమైన సందర్భంలో వస్తుందని అంటున్నారు. ఇంతకన్నా డీటెయిల్స్ బయట పెట్టడం లేదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న జవాన్ లో విజయ్ సేతుపతి విలన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. నిజానికి ముంబైకర్ తో ఆల్రెడీ లాంచ్ అయినప్పటికీ అది డిజాస్టర్ కావడంతో ఎవరికీ గుర్తు లేదు. దీంతో జవానే పరిచయ చిత్రంగా చెబుతున్నాడు. అంచనాలైతే ఎగబాకుతున్నాయి కానీ పఠాన్ ఇచ్చిన లక్ష్యాన్ని దాటుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 26, 2023 5:02 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…