జవాన్ సినిమా విషయంలో షారుఖ్ ఖాన్ తగ్గేదేలే అంటున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. వచ్చే నెల ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. అందులో భాగంగా జిందా బందా అంటూ సాగే మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేస్తారు. దీని వెనుక చాలా విశేషాలున్నాయి. ఆరు రాష్ట్రాల నుంచి పిలిపించిన 1000కి పైగా లేడీ డాన్సర్లతో హీరో ఇంట్రో సాంగ్ గా చిత్రీకరించారు. శోభి డాన్స్ డైరెక్షన్ చేయగా అయిదు రోజుల పాటు చెన్నైలో షూట్ చేశారు. దీనికి అయిన ఖర్చు అక్షరాలా 15 కోట్ల రూపాయలు.
కింగ్ ఖాన్ కెరీర్లోనే ఇది అత్యంత ఖరీదైన పాటగా యూనిట్ చెబుతున్నారు. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన అదిరిపోయే పాటకు షారుఖ్ వేసిన స్టెప్పులు ఆశ్చర్యపరుస్తాయట. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మధురై నుంచి ప్రత్యేకంగా పిలిపించిన లేడీ డాన్సర్లని చూసి మాస్ కి మతులు పోవడం ఖాయమని అంటున్నారు ఈ ఒక్క పాటకు పెట్టిన డబ్బుతో ఓ మీడియం రేంజ్ సినిమానే తీయొచ్చు. అలాంటిది ఇంత బడ్జెట్ అంటే మాటలు కాదు. అయితే బిజినెస్ పరంగా హక్కులు విక్రయించి ఎప్పుడో విపరీత లాభాలు అందుకున్న రెడ్ చిల్లీస్ బ్యానర్ పబ్లిసిటీని ఓ రేంజ్ లో చేయబోతోంది.
ఇంత హడావిడి జరిగే పాటలో హీరోయిన్లు నయనతార, దీపీకా పదుకునే ఉండరట. ఇదో ప్రత్యేకమైన సందర్భంలో వస్తుందని అంటున్నారు. ఇంతకన్నా డీటెయిల్స్ బయట పెట్టడం లేదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న జవాన్ లో విజయ్ సేతుపతి విలన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. నిజానికి ముంబైకర్ తో ఆల్రెడీ లాంచ్ అయినప్పటికీ అది డిజాస్టర్ కావడంతో ఎవరికీ గుర్తు లేదు. దీంతో జవానే పరిచయ చిత్రంగా చెబుతున్నాడు. అంచనాలైతే ఎగబాకుతున్నాయి కానీ పఠాన్ ఇచ్చిన లక్ష్యాన్ని దాటుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 26, 2023 5:02 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…