జవాన్ సినిమా విషయంలో షారుఖ్ ఖాన్ తగ్గేదేలే అంటున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. వచ్చే నెల ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. అందులో భాగంగా జిందా బందా అంటూ సాగే మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేస్తారు. దీని వెనుక చాలా విశేషాలున్నాయి. ఆరు రాష్ట్రాల నుంచి పిలిపించిన 1000కి పైగా లేడీ డాన్సర్లతో హీరో ఇంట్రో సాంగ్ గా చిత్రీకరించారు. శోభి డాన్స్ డైరెక్షన్ చేయగా అయిదు రోజుల పాటు చెన్నైలో షూట్ చేశారు. దీనికి అయిన ఖర్చు అక్షరాలా 15 కోట్ల రూపాయలు.
కింగ్ ఖాన్ కెరీర్లోనే ఇది అత్యంత ఖరీదైన పాటగా యూనిట్ చెబుతున్నారు. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన అదిరిపోయే పాటకు షారుఖ్ వేసిన స్టెప్పులు ఆశ్చర్యపరుస్తాయట. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మధురై నుంచి ప్రత్యేకంగా పిలిపించిన లేడీ డాన్సర్లని చూసి మాస్ కి మతులు పోవడం ఖాయమని అంటున్నారు ఈ ఒక్క పాటకు పెట్టిన డబ్బుతో ఓ మీడియం రేంజ్ సినిమానే తీయొచ్చు. అలాంటిది ఇంత బడ్జెట్ అంటే మాటలు కాదు. అయితే బిజినెస్ పరంగా హక్కులు విక్రయించి ఎప్పుడో విపరీత లాభాలు అందుకున్న రెడ్ చిల్లీస్ బ్యానర్ పబ్లిసిటీని ఓ రేంజ్ లో చేయబోతోంది.
ఇంత హడావిడి జరిగే పాటలో హీరోయిన్లు నయనతార, దీపీకా పదుకునే ఉండరట. ఇదో ప్రత్యేకమైన సందర్భంలో వస్తుందని అంటున్నారు. ఇంతకన్నా డీటెయిల్స్ బయట పెట్టడం లేదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న జవాన్ లో విజయ్ సేతుపతి విలన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. నిజానికి ముంబైకర్ తో ఆల్రెడీ లాంచ్ అయినప్పటికీ అది డిజాస్టర్ కావడంతో ఎవరికీ గుర్తు లేదు. దీంతో జవానే పరిచయ చిత్రంగా చెబుతున్నాడు. అంచనాలైతే ఎగబాకుతున్నాయి కానీ పఠాన్ ఇచ్చిన లక్ష్యాన్ని దాటుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 26, 2023 5:02 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…