నిన్న అట్టహాసంగా జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కోలీవుడ్ పరిశ్రమపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ముప్పై అయిదు నిమిషాల తన సుదీర్ఘ ప్రసంగంలో ఇటీవలే తమిళ నటీనటుల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల గురించి గట్టి క్లాసు తీసుకున్నారు. కేవలం తమ రాష్ట్రానికి చెందినవాళ్లనే తీసుకోవాలంటూ, అత్యవసరమైతేనే షూటింగులు బయట చేయాలంటూ ఇచ్చిన గైడ్ లైన్స్ పట్ల ఇప్పటికే పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ ఇష్యూ గురించి ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీ తరఫున ఎవరూ మాట్లాడలేదు. పవనే స్పందించాడు.
ఏ భాషలో సినిమాలు తీసేవాళ్ళయినా సరే ప్రాంతీయ పరిమితులు పెట్టుకోకూడదని, బ్రోకు పని చేసిన సముతిరఖని తమిళనాడు, ఛాయాగ్రహణం నిర్వహించిన సుజిత్ వాసుదేవన్ కేరళ, పబ్బు సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా ముంబై నుంచి వచ్చారని ఇలా అందరూ కలిస్తేనే గొప్ప చిత్రాలను తీయగలమని హితవు పలికారు. రోజా, జెంటిల్ మెన్ లాంటివి తీసిన ఏఎం రత్నం తెలుగువాడేనని గుర్తు చేశారు. నిజానికి రత్నం నిర్మించింది భారతీయుడు, బాయ్స్ విజయ్ ఖుషి వగైరాలు. పవన్ ఉదాహరించినవి డబ్బింగ్ చేసినవి. స్పీచ్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సరైన టైంలోనే క్లాసు తీసుకున్నారు. కేవలం తమిళులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనడం సరికాదు. అలా అయితే కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, తెలుగు మూలాలున్న విశాల్ తదితరులను బయటికి పొమ్మని అనలేరు కదా. అయినా ఆర్ఆర్ఆర్ లాగా పొన్నియిన్ సెల్వన్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. కేవలం అరవ ఫ్లేవర్ ఎక్కువ కావడం వల్లే. గ్లోబల్ అప్పీల్ ఉన్న సినిమాలు కోలీవుడ్ నుంచి వచ్చి చాలా కాలమయ్యింది. అలా ఎందుకు జరుగుతుందో గుర్తించకుండా చర్యలకు దిగడం ఫలితాన్ని ఇవ్వదు.
This post was last modified on July 26, 2023 8:34 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…