అందాల సుందరి కిరీటాలు దక్కించుకున్న వాళ్ల చూపంతా ప్రధానంగా బాలీవుడ్ మీదే ఉంటుంది. కానీ మాజీ మిస్ ఇండియా, హరియాణా అమ్మాయి మీనాక్షి చౌదరి చూపు మాత్రం టాలీవుడ్ మీద పడింది. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్తో కలిసి చేసిన ఇచట వాహనములు నిలుపరాదు తెలుగులో తన తొలి చిత్రం. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఈ అందాల సుందరికి టాలీవుడ్లో అవకాశాలు ఆగిపోలేదు.
ఖిలాడి, హిట్-2 లాంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపే సంపాదించింది. దీంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో అవకాశం దక్కడం మీనాక్షి కెరీర్లో గొప్ప మలుపు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను తప్పించి మరీ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.
మహేష్ సరసన సెకండ్ హీరోయిన్గా చేసినా సరే.. మీనాక్షి కెరీర్కు మంచి ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఛాన్స్ దక్కిన కొన్ని రోజుల్లోనే మరో క్రేజీ మూవీలో అవకాశం అందుకుంది మీనాక్షి. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ రూపొందించనున్న కొత్త చిత్రంలో మీనాక్షినే కథానాయికగా ఎంచుకున్నారు. ఇది కాక విశ్వక్సేన్ కొత్త సినిమాలోనూ మీనాక్షి కథానాయికగా నటిస్తోంది.
అంటే వచ్చే ఏడాది గుంటూరు కారం సహా మూడు చిత్రాలతో మీనాక్షి ప్రేక్షకులను పలకరించబోతోందన్నమాట. ఆమె ఆల్రెడీ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే రిలీజైన హత్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మీనాక్షి పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. కథ మొత్తం తన చుట్టూనే తిరిగే సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంది. చూస్తుంటే మీనాక్షి రాబోయే రోజుల్లో పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది.
This post was last modified on July 24, 2023 10:40 am
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను…