అందాల సుందరి కిరీటాలు దక్కించుకున్న వాళ్ల చూపంతా ప్రధానంగా బాలీవుడ్ మీదే ఉంటుంది. కానీ మాజీ మిస్ ఇండియా, హరియాణా అమ్మాయి మీనాక్షి చౌదరి చూపు మాత్రం టాలీవుడ్ మీద పడింది. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్తో కలిసి చేసిన ఇచట వాహనములు నిలుపరాదు తెలుగులో తన తొలి చిత్రం. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఈ అందాల సుందరికి టాలీవుడ్లో అవకాశాలు ఆగిపోలేదు.
ఖిలాడి, హిట్-2 లాంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపే సంపాదించింది. దీంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో అవకాశం దక్కడం మీనాక్షి కెరీర్లో గొప్ప మలుపు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను తప్పించి మరీ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.
మహేష్ సరసన సెకండ్ హీరోయిన్గా చేసినా సరే.. మీనాక్షి కెరీర్కు మంచి ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఛాన్స్ దక్కిన కొన్ని రోజుల్లోనే మరో క్రేజీ మూవీలో అవకాశం అందుకుంది మీనాక్షి. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ రూపొందించనున్న కొత్త చిత్రంలో మీనాక్షినే కథానాయికగా ఎంచుకున్నారు. ఇది కాక విశ్వక్సేన్ కొత్త సినిమాలోనూ మీనాక్షి కథానాయికగా నటిస్తోంది.
అంటే వచ్చే ఏడాది గుంటూరు కారం సహా మూడు చిత్రాలతో మీనాక్షి ప్రేక్షకులను పలకరించబోతోందన్నమాట. ఆమె ఆల్రెడీ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే రిలీజైన హత్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మీనాక్షి పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. కథ మొత్తం తన చుట్టూనే తిరిగే సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంది. చూస్తుంటే మీనాక్షి రాబోయే రోజుల్లో పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది.
This post was last modified on July 24, 2023 10:40 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…