అందాల సుందరి కిరీటాలు దక్కించుకున్న వాళ్ల చూపంతా ప్రధానంగా బాలీవుడ్ మీదే ఉంటుంది. కానీ మాజీ మిస్ ఇండియా, హరియాణా అమ్మాయి మీనాక్షి చౌదరి చూపు మాత్రం టాలీవుడ్ మీద పడింది. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్తో కలిసి చేసిన ఇచట వాహనములు నిలుపరాదు తెలుగులో తన తొలి చిత్రం. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఈ అందాల సుందరికి టాలీవుడ్లో అవకాశాలు ఆగిపోలేదు.
ఖిలాడి, హిట్-2 లాంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపే సంపాదించింది. దీంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో అవకాశం దక్కడం మీనాక్షి కెరీర్లో గొప్ప మలుపు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను తప్పించి మరీ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.
మహేష్ సరసన సెకండ్ హీరోయిన్గా చేసినా సరే.. మీనాక్షి కెరీర్కు మంచి ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఛాన్స్ దక్కిన కొన్ని రోజుల్లోనే మరో క్రేజీ మూవీలో అవకాశం అందుకుంది మీనాక్షి. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ రూపొందించనున్న కొత్త చిత్రంలో మీనాక్షినే కథానాయికగా ఎంచుకున్నారు. ఇది కాక విశ్వక్సేన్ కొత్త సినిమాలోనూ మీనాక్షి కథానాయికగా నటిస్తోంది.
అంటే వచ్చే ఏడాది గుంటూరు కారం సహా మూడు చిత్రాలతో మీనాక్షి ప్రేక్షకులను పలకరించబోతోందన్నమాట. ఆమె ఆల్రెడీ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే రిలీజైన హత్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మీనాక్షి పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. కథ మొత్తం తన చుట్టూనే తిరిగే సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంది. చూస్తుంటే మీనాక్షి రాబోయే రోజుల్లో పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…