అందాల సుందరి కిరీటాలు దక్కించుకున్న వాళ్ల చూపంతా ప్రధానంగా బాలీవుడ్ మీదే ఉంటుంది. కానీ మాజీ మిస్ ఇండియా, హరియాణా అమ్మాయి మీనాక్షి చౌదరి చూపు మాత్రం టాలీవుడ్ మీద పడింది. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్తో కలిసి చేసిన ఇచట వాహనములు నిలుపరాదు తెలుగులో తన తొలి చిత్రం. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఈ అందాల సుందరికి టాలీవుడ్లో అవకాశాలు ఆగిపోలేదు.
ఖిలాడి, హిట్-2 లాంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపే సంపాదించింది. దీంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో అవకాశం దక్కడం మీనాక్షి కెరీర్లో గొప్ప మలుపు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను తప్పించి మరీ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.
మహేష్ సరసన సెకండ్ హీరోయిన్గా చేసినా సరే.. మీనాక్షి కెరీర్కు మంచి ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఛాన్స్ దక్కిన కొన్ని రోజుల్లోనే మరో క్రేజీ మూవీలో అవకాశం అందుకుంది మీనాక్షి. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ రూపొందించనున్న కొత్త చిత్రంలో మీనాక్షినే కథానాయికగా ఎంచుకున్నారు. ఇది కాక విశ్వక్సేన్ కొత్త సినిమాలోనూ మీనాక్షి కథానాయికగా నటిస్తోంది.
అంటే వచ్చే ఏడాది గుంటూరు కారం సహా మూడు చిత్రాలతో మీనాక్షి ప్రేక్షకులను పలకరించబోతోందన్నమాట. ఆమె ఆల్రెడీ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే రిలీజైన హత్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మీనాక్షి పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. కథ మొత్తం తన చుట్టూనే తిరిగే సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంది. చూస్తుంటే మీనాక్షి రాబోయే రోజుల్లో పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…