సినిమా హీరోల మీద ఎంతైనా అభిమానం, ప్రేమ ఉండొచ్చు కానీ అది ప్రాణాలను పణంగా పెట్టేంత మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు జరిగే కొన్ని సంఘటనలు కన్నవాళ్లకు జీవితాంతం కడుపు కోతను మిగిలిస్తాయి. ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు యువకులు ప్రమాదం బారిన పడి తుది శ్వాస తీసుకోవడం కలచి వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ నరసారావుపేట జిల్లా మోపువారిపాలెంలో నివసించే నక్కా వెంకటేష్ , పోలూరు సాయిసూర్య ఇద్దరూ సూర్య వీర ఫ్యాన్స్. ఇద్దరి వయసు 20 సంవత్సరాల లోపే.
కంగువా టీజర్, పోస్టర్ తమ హీరో బర్త్ డే సందర్భంగా రిలీజ్ కావడంతో ఆ ఆనందాన్ని పంచుకోవటానికి ఒక ఫ్లెక్సీ తయారు చేయించి అందరికీ కనిపించేలా కట్టడం కోసం కరెంటు స్థంభం ఎక్కారు. అయితే ఆ సమయంలో విద్యుత్ ప్రసరణ జరుగుతోంది. ఈ విషయం తెలియక అనుకోకుండా తీగలను తాకడంతో ఇద్దరూ అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. వీళ్ళంతా పట్టణంలోని డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు.
గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ ఫ్యాన్స్ తమ ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. చిన్న అప్రమత్తత ప్రాణాలు తీస్తుందని తెలిసినా కూడా అవసరం లేని రిస్కు తీసుకుంటున్నారు. మాములుగా ఎవరైనా గాయపడితేనే తల్లడిల్లిపోయే సూర్య ఆపద, అవసరం ఉన్న వాళ్ళ కోసమే అగరం ఫౌండేషన్ నడిపిస్తున్నాడు. అలాంటిది తన పుట్టినరోజు నాడు అమాయకులైన ఇద్దరు కుర్రాళ్ళు అసువులు బాయడం ఎంత బాధిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. ఫ్యానిజం పేరిట కార్యక్రమాలు చేయొచ్చు కానీ ప్రమాదాలతో మాత్రం ఆడుకోకూడదు.
This post was last modified on July 24, 2023 12:46 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…