కల్కి 2898 ఏడీగా మారిన ప్రాజెక్ట్-కే సినిమా నుంచి తాజాగా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి చిత్ర బృందంపై తీవ్ర విమర్శలు గుప్పించిన నెటిజన్లు.. ఒక్క రోజు వ్యవధిలో తమ ఆలోచన మార్చుకుని నాగ్ అశ్విన్ అండ్ టీంను కొనియాడుతున్నారు. పక్కా ఇంటర్నేషనల్ మూవీలా కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
టీజర్ చూసి దర్శక ధీరుడు రాజమౌళి సైతం అబ్బురపడ్డాడు. నాగి అండ్ టీం మీద ప్రశంసల జల్లు కురిపించాడు. దీంతో పాటు చివర్లో చిన్న పంచ్ లైన్ లాంటిది పెట్టాడు జక్కన్న. ఇక సమాధానం తెలియాల్సిన ప్రశ్న ఒక్కటే అని.. అదే రిలీజ్ డేట్ ఎప్పుడు? అని రాజమౌళి పేర్కొన్నాడు. ఈ ప్రశ్న సోషల్ మీడియాలో మంచి వినోదానికి తెర తీసింది.
రాజమౌళి మీద ఆయన సన్నిహితులతో పాటు నెటిజన్లు చాలామంది కౌంటర్లు వేస్తున్నారు. స్వయంగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ.. ఈ ట్వీట్పై సరదాగా స్పందించారు. రిలీజ్ డేట్ గురించి అడుగుతున్నది ఎవరో చూశారా అని ఆయన అన్నారు. దీనికి రాజమౌళి తనయుడు కార్తికేయ నవ్వుల ఎమోజీలు పెట్టాడు. రాజమౌళి సినిమాలంటేనే రిలీజ్ డేట్ల విషయంలో ఎప్పుడూ క్లారిటీ ఉండదు.
చెప్పిన డేట్కు కట్టుబడటం రాజమౌళికి చాలా సినిమాల నుంచి అలవాటు లేదు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్.. ఇలా ప్రతి సినిమా కూడా డేట్ మార్చుకున్నదే. వాయిదాల మీద వాయిదాలు పడ్డదే. ఆర్ఆర్ఆర్ అయితే ఎన్నిసార్లు డేట్ మార్చుకుందో లెక్క లేదు. ఇలాంటి చరిత్ర ఉన్న జక్కన్న కల్కి సినిమా రిలీజ్ డేట్ గురించి అడగడంతో నెటిజన్లు ఆయన మీద కౌంటర్లు వేస్తున్నారు. దీని మీద సరదా కామెంట్లు, మీమ్స్ చాలానే కనిపిస్తున్నాయి.
This post was last modified on July 22, 2023 9:29 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…