ఈ హైటెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. చౌక ధరలో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ డేటా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో యువత మొదలు పెద్దవాళ్ల వరకు అంతా స్మార్ట్ ఫోన్లకు చాలా సమయం అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే మనదేశంలో పోర్న్ చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే, కొందరు కామాంధులు పసిపిల్లల మొదలు ముసలి వాళ్ళ వరకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే ప్రేమ ముసుగులో యువతులకు ఆశ చూపి వారిని శారీరకంగా లోబరుచుకుంటున్నారు.
ఆ తర్వాత ఆ వీడియోలు చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం, పదేపదే అత్యాచారానికి పాల్పడడం వంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇక, ఇటువంటి బెదిరింపు వీడియోలు ఆన్లైన్లో రిలీజ్ చేస్తామంటూ లక్షలకు లక్షల డబ్బులు గుంజిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆ వీడియోలు బయటపడితే తమ పరువు పోతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే, ఇటువంటి ఘటనలు సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు షాక్ ఇస్తున్నాయి.
తాజాగా కోల్ కతాలో ఓ బెంగాలీ యువనటికి ఈ తరహా బ్లాక్మెయిల్, వేధింపులు ఎదురయ్యాయి. ఆ యువనటి, మోడల్ ఇంట్లోనే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, జులై 5న జరిగిన ఘటనను ఆయన వీడియో తీసి ఆ హీరోయిన్ ను బెదిరించడం మొదలు పెట్టాడు. డబ్బులు అప్పు కావాలంటూ ఆమె ఇంటికి వెళ్లిన సదరు కామాంధుడు ఆమె ఒంటరిగా నివసిస్తుందన్న విషయం తెలుసుకొని ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడితే ఆ వీడియోను పోర్న్ సైట్లో అప్లోడ్ చేస్తానని ఆమెను బెదిరించాడు.
దీంతో, మొదట భయపడ్డ ఆ హీరోయిన్ చివరకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన జాదవ పూర్ పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. హీరోయిన్ పై ఇటువంటి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…