ఈ హైటెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. చౌక ధరలో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ డేటా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో యువత మొదలు పెద్దవాళ్ల వరకు అంతా స్మార్ట్ ఫోన్లకు చాలా సమయం అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే మనదేశంలో పోర్న్ చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే, కొందరు కామాంధులు పసిపిల్లల మొదలు ముసలి వాళ్ళ వరకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే ప్రేమ ముసుగులో యువతులకు ఆశ చూపి వారిని శారీరకంగా లోబరుచుకుంటున్నారు.
ఆ తర్వాత ఆ వీడియోలు చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం, పదేపదే అత్యాచారానికి పాల్పడడం వంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇక, ఇటువంటి బెదిరింపు వీడియోలు ఆన్లైన్లో రిలీజ్ చేస్తామంటూ లక్షలకు లక్షల డబ్బులు గుంజిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆ వీడియోలు బయటపడితే తమ పరువు పోతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే, ఇటువంటి ఘటనలు సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు షాక్ ఇస్తున్నాయి.
తాజాగా కోల్ కతాలో ఓ బెంగాలీ యువనటికి ఈ తరహా బ్లాక్మెయిల్, వేధింపులు ఎదురయ్యాయి. ఆ యువనటి, మోడల్ ఇంట్లోనే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, జులై 5న జరిగిన ఘటనను ఆయన వీడియో తీసి ఆ హీరోయిన్ ను బెదిరించడం మొదలు పెట్టాడు. డబ్బులు అప్పు కావాలంటూ ఆమె ఇంటికి వెళ్లిన సదరు కామాంధుడు ఆమె ఒంటరిగా నివసిస్తుందన్న విషయం తెలుసుకొని ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడితే ఆ వీడియోను పోర్న్ సైట్లో అప్లోడ్ చేస్తానని ఆమెను బెదిరించాడు.
దీంతో, మొదట భయపడ్డ ఆ హీరోయిన్ చివరకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన జాదవ పూర్ పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. హీరోయిన్ పై ఇటువంటి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది.
This post was last modified on July 21, 2023 4:10 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…