సరిగ్గా ఇంకో వారం రోజుల్లో బ్రో వచ్చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ తొలి కలయికగా ఇది అనౌన్స్ చేసిన టైంలో విపరీతమైన లెక్కలు, నమ్మకాలు ఏర్పడ్డాయి. తీరా రిలీజ్ సమయానికి అంచనాలు మితిమీరకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జాగ్రత్తగా చాలా లో ప్రొఫైల్ లో ప్రమోషన్లు చేస్తోంది. అభిమానులు ఈ విషయంగా అసంతృప్తిగా ఉన్నా రేపు ట్రైలర్ వచ్చాక అభిప్రాయాలు ఏమైనా మారతాయేమో చూడాలి. వినోదయ సితం రీమేక్ గా సముతిరఖని దర్శకత్వంలో రూపొందుతున్న బ్రోకు తమన్ మ్యూజిక్ పరంగా మాత్రం నెగటివ్ ఫీడ్ బ్యాకే తెచ్చుకుంది.
ఆదిపురుష్ కు బహిరంగంగా ప్రకటించినట్టు కాకుండా బిజినెస్ లెక్కలను ఈసారి నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఓపెన్ గా బయట పెట్టలేదు. బయ్యర్లు సేఫ్ అయ్యేలా మంచి రేట్లకే ఇచ్చామని, బెనిఫిట్ షోలకు పర్మిషన్లు, టికెట్ రేట్ల పెంపు లాంటివి ఉండవని నొక్కి వక్కాణించారు. అంటే కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆత్రం లేదనే సందేశం డైరెక్ట్ గానే ఇచ్చారు. అసలే బ్రో రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. ఫైట్లు గట్రా పెద్దగా ఉండవు. ఉన్న డ్యూయెట్ కూడా మేనల్లుడికే. పవన్ కేవలం పబ్బు సాంగ్, ఎమోషనల్ పాటకు మాత్రమే పరిమితం.
పోటీ లేదు కాబట్టి ఓపెనింగ్స్ పరంగా బ్రోకు ఎలాంటి ఇబ్బంది లేదు. యావరేజ్ అనిపించుకున్నా చాలు రికార్డుల మోత ఖాయం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసిపితో ఉన్న రాజకీయ పోరాటం వల్ల విడుదల రోజు థియేటర్ల దగ్గర ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయేమోనని డిస్ట్రిబ్యూటర్లు కొంత ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. కేతిక శర్మ హీరోయిన్ గా, ప్రియా ప్రకాష్ వారియర్ తేజు చెల్లెలిగా నటిస్తున్న బ్రోలో పవర్ స్టార్ కి జోడి ఉండదు. పాటల సంగతి ఎలా ఉన్నా త్రివిక్రమ్ మార్కు డైలాగులు పంచులైతే బ్రోలో బోలెడు ఉంటాయట.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…