Movie News

చాన్నాళ్లకు కొత్త దర్శకుడికి రవితేజ ఛాన్స్

టాలీవుడ్లో చాలామంది యువ దర్శకులకు అవకాశాలు ఇచ్చి వాళ్లు పెద్ద రేంజికి వెళ్లేలా చేసిన హీరో మాస్ రాజా రవితేజ. శ్రీను వైట్ల, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ.. ఇలా రవితేజ పరిచయం చేసి పెద్ద దర్శకులైన వాళ్ల జాబితా పెద్దదే. ఐతే ఈ మధ్య మాస్ రాజా ఇలా కొత్త దర్శకులను ప్రోత్సహించట్లేదు. 2017లో వచ్చిన రవితేజ సినిమా ‘టచ్ చేసి చూడు’తో చివరగా ఒక కొత్త దర్శకుడు పరిచయం అయ్యాడు.

అతనే.. విక్రమ్ సిరికొండ. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ మాస్ రాజా ఈ సాహసం చేయలేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తీసిన శరత్ మండవకు తెలుగులో తొలి సినిమా ఇదే కానీ.. అతను ఆల్రెడీ తమిళంలో ఒక సినిమా తీశాడు. ఐతే ఇప్పుడు మాస్ రాజా మళ్లీ ఓ కొత్త దర్శకుడితో జట్టు కట్టబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు వాసు. తనతో అతి త్వరలో మాస్ రాజా సినిమా మొదలు కాబోతోంది.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ రవితేజతో తొలిసారి జట్టు కట్టబోతోంది. వాసు చెప్పిన ఓ మాస్ కథ అటు నిర్మాణ సంస్థకు, ఇటు రవితేజకు నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే ముహూర్త వేడుక చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో రవితేజ ఒకడు. ఆయన లైనప్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్రేజీగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈగల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం సమాంతరంగా పని చేస్తున్నాడు మాస్ రాజా. డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేనితో రవితేజ చేయబోయే సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు. అది మైత్రీ మూవీ మేకర్స్‌లో తెరకెక్కబోతోంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ హిట్ ‘రైడర్’ను రవితేజ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ‘ధమాకా’ తర్వాత త్రినాథరావు నక్కినతోనూ మాస్ రాజా ఓ సినిమా చేయనున్నాడు.

This post was last modified on July 20, 2023 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

19 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago