ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్లో సంచలనం రేపుతున్న చిత్రం.. బేబి. చిన్న సినిమాగా రిలీజై పెద్ద రేంజికి వెళ్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. వర్షాల ప్రభావంలో కూడా ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో కథ.. పాత్రలు చాలా ట్రెండీగా ఉండటం వల్ల.. రియలిస్టిగ్గా అనిపించడం వల్ల యూత్ బాగా కనెక్టవుతున్నారన్నది నిజం.
నిజానికి ఈ కథ కూడా పూర్తి కల్పితం ఏమీ కాదు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక వాస్తవ ఉదంతం ఆధారంగా రైటర్ కమ్ డైరెక్టర్ సాయిరాజేష్ ఈ కథను తీర్చిదిద్దుకోవడం విశేషం. ఒక ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. సేలంలో కొన్నేళ్ల కిందట ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇద్దరూ ఆమెను ప్రేమించిన వాళ్లు కావడం విశేషం.
ఇంజినీరింగ్ చదివే ఒక అమ్మాయి తన క్లాస్ మేట్తోనే కాక.. ఒక ఆటోడ్రైవర్తో ఒకేసారి స్నేహం చేసింది. ప్రేమలోనూ పడింది. ఒకరికి తెలియకుండా ఒకరితో కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేశాక.. అనుకోకుండా ఆ విషయం ఆ ఇద్దరు అబ్బాయిలకు తెలిసిపోయింది. దీంతో వాళ్లిద్దరూ కసితో రగిలిపోయి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసి.. హత్యకు సంబంధించి విజువల్స్ చూసి సాయిరాజేష్ కదిలిపోయారట.
అందులో హత్య అంశాన్ని పక్కన పెట్టి అమ్మాయి పర్సప్షన్ ఏమై ఉంటుంది అనే ఆలోచనతో ఆ ముగ్గురి పాత్రలనే తీసుకుని కథ అల్లుకున్నట్లు సాయిరాజేష్ తెలిపాడు. ఆ కథను ఉన్నదున్నట్లుగా తీస్తే సొసైటీకి చెడు సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అమ్మాయిని అబ్బాయిలిద్దరూ చంపినట్లు చూపించలేదని.. కథనం.. పతాక ఘట్టం వేరే రకంగా చూపించానని సాయిరాజేష్ తెలిపాడు.
This post was last modified on July 20, 2023 2:46 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…