ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్లో సంచలనం రేపుతున్న చిత్రం.. బేబి. చిన్న సినిమాగా రిలీజై పెద్ద రేంజికి వెళ్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. వర్షాల ప్రభావంలో కూడా ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో కథ.. పాత్రలు చాలా ట్రెండీగా ఉండటం వల్ల.. రియలిస్టిగ్గా అనిపించడం వల్ల యూత్ బాగా కనెక్టవుతున్నారన్నది నిజం.
నిజానికి ఈ కథ కూడా పూర్తి కల్పితం ఏమీ కాదు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక వాస్తవ ఉదంతం ఆధారంగా రైటర్ కమ్ డైరెక్టర్ సాయిరాజేష్ ఈ కథను తీర్చిదిద్దుకోవడం విశేషం. ఒక ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. సేలంలో కొన్నేళ్ల కిందట ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇద్దరూ ఆమెను ప్రేమించిన వాళ్లు కావడం విశేషం.
ఇంజినీరింగ్ చదివే ఒక అమ్మాయి తన క్లాస్ మేట్తోనే కాక.. ఒక ఆటోడ్రైవర్తో ఒకేసారి స్నేహం చేసింది. ప్రేమలోనూ పడింది. ఒకరికి తెలియకుండా ఒకరితో కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేశాక.. అనుకోకుండా ఆ విషయం ఆ ఇద్దరు అబ్బాయిలకు తెలిసిపోయింది. దీంతో వాళ్లిద్దరూ కసితో రగిలిపోయి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసి.. హత్యకు సంబంధించి విజువల్స్ చూసి సాయిరాజేష్ కదిలిపోయారట.
అందులో హత్య అంశాన్ని పక్కన పెట్టి అమ్మాయి పర్సప్షన్ ఏమై ఉంటుంది అనే ఆలోచనతో ఆ ముగ్గురి పాత్రలనే తీసుకుని కథ అల్లుకున్నట్లు సాయిరాజేష్ తెలిపాడు. ఆ కథను ఉన్నదున్నట్లుగా తీస్తే సొసైటీకి చెడు సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అమ్మాయిని అబ్బాయిలిద్దరూ చంపినట్లు చూపించలేదని.. కథనం.. పతాక ఘట్టం వేరే రకంగా చూపించానని సాయిరాజేష్ తెలిపాడు.
This post was last modified on July 20, 2023 2:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…