Movie News

‘బేబి’ రియల్ స్టోరీలో ఏం జరిగిందో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సంచలనం రేపుతున్న చిత్రం.. బేబి. చిన్న సినిమాగా రిలీజై పెద్ద రేంజికి వెళ్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. వర్షాల ప్రభావంలో కూడా ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో కథ.. పాత్రలు చాలా ట్రెండీగా ఉండటం వల్ల.. రియలిస్టిగ్గా అనిపించడం వల్ల యూత్ బాగా కనెక్టవుతున్నారన్నది నిజం.

నిజానికి ఈ కథ కూడా పూర్తి కల్పితం ఏమీ కాదు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక వాస్తవ ఉదంతం ఆధారంగా రైటర్ కమ్ డైరెక్టర్ సాయిరాజేష్ ఈ కథను తీర్చిదిద్దుకోవడం విశేషం. ఒక ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. సేలంలో కొన్నేళ్ల కిందట ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇద్దరూ ఆమెను ప్రేమించిన వాళ్లు కావడం విశేషం.

ఇంజినీరింగ్ చదివే ఒక అమ్మాయి తన క్లాస్ మేట్‌తోనే కాక.. ఒక ఆటోడ్రైవర్‌తో ఒకేసారి స్నేహం చేసింది. ప్రేమలోనూ పడింది. ఒకరికి తెలియకుండా ఒకరితో కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేశాక.. అనుకోకుండా ఆ విషయం ఆ ఇద్దరు అబ్బాయిలకు తెలిసిపోయింది. దీంతో వాళ్లిద్దరూ కసితో రగిలిపోయి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసి.. హత్యకు సంబంధించి విజువల్స్ చూసి సాయిరాజేష్ కదిలిపోయారట.

అందులో హత్య అంశాన్ని పక్కన పెట్టి అమ్మాయి పర్సప్షన్ ఏమై ఉంటుంది అనే ఆలోచనతో ఆ ముగ్గురి పాత్రలనే తీసుకుని కథ అల్లుకున్నట్లు సాయిరాజేష్ తెలిపాడు. ఆ కథను ఉన్నదున్నట్లుగా తీస్తే సొసైటీకి చెడు సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అమ్మాయిని అబ్బాయిలిద్దరూ చంపినట్లు చూపించలేదని.. కథనం.. పతాక ఘట్టం వేరే రకంగా చూపించానని సాయిరాజేష్ తెలిపాడు.

This post was last modified on July 20, 2023 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago