ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న అత్యధిక బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్-కే. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు అభిమానులు. సినిమా మొదలైన ఏడాది తర్వాత ఇప్పుడే ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఐతే అభిమానుల అంచనాలను కనీస స్థాయిలో కూడా ఈ ఫస్ట్ లుక్ అందుకోలేకపోయింది.
ఏదో అభిమానులు చేసే ఫేక్ ఎడిట్ తరహాలో ఉందంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ఉందంటూ బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ లుక్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా.. ఈ ఫస్ట్ లుక్ విషయంలోట్రోలింగ్ కాస్త పొలిటికల్ కలర్ కూడా తీసుకోవడం గమనార్హం. ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి.. దర్శకుడు నాగ్ అశ్విన్ను తెలంగాణ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
గతంలో తెలంగాణ సెక్రటేరియట్ డిజైన్ చూసి నాగ్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఈ డిజైన్ బాగా లేదని.. అంటే అది రాజకీయ కోణంలో కాదని, నిర్మాణ పరంగా ఆ డిజైన్ ఆకట్టుకునేలా లేదని… అవసరమైతే తాను మంచి ఆర్కిటెక్ట్లను సూచిస్తానని.. మనం మరింత మెరుగ్గా దీన్ని మార్చవచ్చని ట్వీట్ చేశాడు నాగి. ఇప్పుడు ఆ ట్వీట్ను గుర్తు చేసేలా తెలంగాణ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ప్రాజెక్ట్-కే ఫస్ట్ లుక్ బాగా లేదని.. అంటే అది రాజకీయంగా కాదని, సినిమా పరంగా అని.. అవసరం అయితే మంచి డిజైనర్లను తాము సూచిస్తామని.. ఫస్ట్ లుక్ను మరింత మెరుగ్గా మారుద్దామని.. అచ్చం నాగ్ అశ్వని్ స్టయిల్లోనే ట్వీట్లు వేస్తున్నారు తెలంగాణ నెటిజన్లు. నాగ్ అశ్విన్ అప్పుడు నిజాయితీగానే తన అభిప్రాయం చెప్పినా.. ఇప్పుడు మాత్రం దానికి తెలంగాణ నెటిజన్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
This post was last modified on July 20, 2023 11:12 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…