Movie News

అప్ప‌టి నాగ్ అశ్విన్ ట్వీట్‌పై ఇప్పుడు ట్రోలింగ్


ప్ర‌స్తుతం ఇండియాలో తెర‌కెక్కుతున్న అత్య‌ధిక‌ బ‌డ్జెట్ చిత్రం ప్రాజెక్ట్‌-కే. ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ప్ర‌భాస్ హీరోగా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ  సినిమాకు సంబంధించి ప్ర‌తిదీ విశేషంగా చెప్పుకుంటూ వ‌చ్చారు అభిమానులు. సినిమా మొద‌లైన ఏడాది త‌ర్వాత ఇప్పుడే ఈ చిత్రం నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఐతే అభిమానుల అంచ‌నాల‌ను క‌నీస స్థాయిలో కూడా ఈ ఫ‌స్ట్ లుక్ అందుకోలేక‌పోయింది.

ఏదో అభిమానులు చేసే ఫేక్ ఎడిట్ త‌ర‌హాలో ఉందంటూ ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ ఉందంటూ బుధ‌వారం సాయంత్రం నుంచి సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రుగుతోంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ అయితే ఈ లుక్ విష‌యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా.. ఈ ఫ‌స్ట్ లుక్ విష‌యంలోట్రోలింగ్ కాస్త పొలిటిక‌ల్ క‌ల‌ర్ కూడా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ చూసి.. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ను తెలంగాణ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

గ‌తంలో తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ డిజైన్ చూసి నాగ్ అశ్విన్ విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఈ డిజైన్ బాగా లేద‌ని.. అంటే అది రాజ‌కీయ కోణంలో కాద‌ని, నిర్మాణ ప‌రంగా ఆ డిజైన్ ఆక‌ట్టుకునేలా లేద‌ని… అవ‌స‌ర‌మైతే తాను మంచి ఆర్కిటెక్ట్‌ల‌ను సూచిస్తాన‌ని.. మ‌నం మ‌రింత మెరుగ్గా దీన్ని మార్చ‌వ‌చ్చ‌ని ట్వీట్ చేశాడు నాగి. ఇప్పుడు ఆ ట్వీట్‌ను గుర్తు చేసేలా తెలంగాణ నెటిజ‌న్లు కౌంటర్లు వేస్తున్నారు. ప్రాజెక్ట్-కే ఫ‌స్ట్ లుక్ బాగా లేద‌ని.. అంటే అది రాజ‌కీయంగా కాద‌ని, సినిమా ప‌రంగా అని.. అవ‌స‌రం అయితే మంచి డిజైన‌ర్ల‌ను తాము సూచిస్తామ‌ని.. ఫ‌స్ట్ లుక్‌ను మ‌రింత మెరుగ్గా మారుద్దామ‌ని.. అచ్చం నాగ్ అశ్వ‌ని్ స్ట‌యిల్లోనే ట్వీట్లు వేస్తున్నారు తెలంగాణ నెటిజ‌న్లు. నాగ్ అశ్విన్ అప్పుడు నిజాయితీగానే త‌న అభిప్రాయం చెప్పినా.. ఇప్పుడు మాత్రం దానికి తెలంగాణ నెటిజ‌న్లు ప్ర‌తీకారం తీర్చుకుంటున్నారు.

This post was last modified on July 20, 2023 11:12 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

3 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

5 hours ago