మెగాస్టార్ మేనల్లుడు, టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగానే గాయపడ్డాడు. దాని వల్ల అతను కొన్ని నెలలు ఆసుపత్రిలో.. ఉన్నాడు. కొన్ని నెలలు ఇంటి నుంచి కదల్లేదు. ఏడాది తర్వాత కానీ మళ్లీ షూటింగ్ లకు హాజరు కాలేదు. తర్వాత అతను ’విరూపాక్ష‘ సినిమాలో నటించాడు. అది ఈ వేసవిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పుడు తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ’బ్రో‘తో ప్రేక్షకులను పలకరించడబోతున్నాడు తేజు. దీని తర్వాత తేజు ఏం చేస్తాడనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తాను సంపత్ నంది దర్శకత్వంలో నటించబోతున్నట్లు తేజు ధ్రువీకరించాడు. కానీ ఆ సినిమా మొదలు కావడానికి కొంచెం సమయం పడుతుందని తేజు చెప్పాడు.
యాక్సిడెంట్ కు సంబంధించి తనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని.. ఒక సర్జరీ చేయించుకోవాల్సి ఉందని.. మూణ్నాలుగు నెలలు పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించే ప్రయత్నంలో ఉంటానని.. ఆ తర్వాతే సంపత్ నంది సినిమా ఉటుందని తేజు వెల్లడించాడు. కాగా తాను ఇప్పటికే ఒక షార్ట్ ఫిలింలో నటించినట్లు తేజు వెల్లడించడం విశేషం. నేరుగా ఫీచర్ ఫిలింతోనే హీరోగా మారిన తేజు.. ఇప్పటిదాకా ఎన్నడూ షార్ట్ ఫిలిం చేసింది లేదు.
మరి ఇప్పుడు తొలిసారిగా ఒక కొత్త దర్శకుడితో షార్ట్ ఫిలిం చేశాడంటే.. అది ఎలా ఉంటుందో చూడాలి. దాని వివరాలేంటి అని అడిగితే.. మీరే చూస్తారుగా అనేశాడు తేజు. ’చిత్రలహరి‘తో కథల ఎంపికలో తన తీరు మారిందని.. అక్కడ్నుంచి రొటీన్ సినిమాలు పక్కన పెట్టి వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్నానని చెప్పాడు తేజు. ఐతే మాస్ సినిమాలకు పూర్తిగా దూరంకానని.. అప్పుడప్పుడూ ఒకటి చేస్తానని.. సంపత్ నందితో చేసేది అలాంటి సినిమానే అని తేజు తెలిపాడు.
This post was last modified on July 19, 2023 11:21 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…