మెగాస్టార్ మేనల్లుడు, టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగానే గాయపడ్డాడు. దాని వల్ల అతను కొన్ని నెలలు ఆసుపత్రిలో.. ఉన్నాడు. కొన్ని నెలలు ఇంటి నుంచి కదల్లేదు. ఏడాది తర్వాత కానీ మళ్లీ షూటింగ్ లకు హాజరు కాలేదు. తర్వాత అతను ’విరూపాక్ష‘ సినిమాలో నటించాడు. అది ఈ వేసవిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పుడు తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ’బ్రో‘తో ప్రేక్షకులను పలకరించడబోతున్నాడు తేజు. దీని తర్వాత తేజు ఏం చేస్తాడనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తాను సంపత్ నంది దర్శకత్వంలో నటించబోతున్నట్లు తేజు ధ్రువీకరించాడు. కానీ ఆ సినిమా మొదలు కావడానికి కొంచెం సమయం పడుతుందని తేజు చెప్పాడు.
యాక్సిడెంట్ కు సంబంధించి తనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని.. ఒక సర్జరీ చేయించుకోవాల్సి ఉందని.. మూణ్నాలుగు నెలలు పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించే ప్రయత్నంలో ఉంటానని.. ఆ తర్వాతే సంపత్ నంది సినిమా ఉటుందని తేజు వెల్లడించాడు. కాగా తాను ఇప్పటికే ఒక షార్ట్ ఫిలింలో నటించినట్లు తేజు వెల్లడించడం విశేషం. నేరుగా ఫీచర్ ఫిలింతోనే హీరోగా మారిన తేజు.. ఇప్పటిదాకా ఎన్నడూ షార్ట్ ఫిలిం చేసింది లేదు.
మరి ఇప్పుడు తొలిసారిగా ఒక కొత్త దర్శకుడితో షార్ట్ ఫిలిం చేశాడంటే.. అది ఎలా ఉంటుందో చూడాలి. దాని వివరాలేంటి అని అడిగితే.. మీరే చూస్తారుగా అనేశాడు తేజు. ’చిత్రలహరి‘తో కథల ఎంపికలో తన తీరు మారిందని.. అక్కడ్నుంచి రొటీన్ సినిమాలు పక్కన పెట్టి వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్నానని చెప్పాడు తేజు. ఐతే మాస్ సినిమాలకు పూర్తిగా దూరంకానని.. అప్పుడప్పుడూ ఒకటి చేస్తానని.. సంపత్ నందితో చేసేది అలాంటి సినిమానే అని తేజు తెలిపాడు.
This post was last modified on July 19, 2023 11:21 pm
ఎవరో ఒక హీరోయిన్.. లేదా కాస్త ఫేమ్ ఉన్న అమ్మాయి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. రెడిట్లో తన గురించి…
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…