మెగాస్టార్ మేనల్లుడు, టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగానే గాయపడ్డాడు. దాని వల్ల అతను కొన్ని నెలలు ఆసుపత్రిలో.. ఉన్నాడు. కొన్ని నెలలు ఇంటి నుంచి కదల్లేదు. ఏడాది తర్వాత కానీ మళ్లీ షూటింగ్ లకు హాజరు కాలేదు. తర్వాత అతను ’విరూపాక్ష‘ సినిమాలో నటించాడు. అది ఈ వేసవిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పుడు తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ’బ్రో‘తో ప్రేక్షకులను పలకరించడబోతున్నాడు తేజు. దీని తర్వాత తేజు ఏం చేస్తాడనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తాను సంపత్ నంది దర్శకత్వంలో నటించబోతున్నట్లు తేజు ధ్రువీకరించాడు. కానీ ఆ సినిమా మొదలు కావడానికి కొంచెం సమయం పడుతుందని తేజు చెప్పాడు.
యాక్సిడెంట్ కు సంబంధించి తనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని.. ఒక సర్జరీ చేయించుకోవాల్సి ఉందని.. మూణ్నాలుగు నెలలు పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించే ప్రయత్నంలో ఉంటానని.. ఆ తర్వాతే సంపత్ నంది సినిమా ఉటుందని తేజు వెల్లడించాడు. కాగా తాను ఇప్పటికే ఒక షార్ట్ ఫిలింలో నటించినట్లు తేజు వెల్లడించడం విశేషం. నేరుగా ఫీచర్ ఫిలింతోనే హీరోగా మారిన తేజు.. ఇప్పటిదాకా ఎన్నడూ షార్ట్ ఫిలిం చేసింది లేదు.
మరి ఇప్పుడు తొలిసారిగా ఒక కొత్త దర్శకుడితో షార్ట్ ఫిలిం చేశాడంటే.. అది ఎలా ఉంటుందో చూడాలి. దాని వివరాలేంటి అని అడిగితే.. మీరే చూస్తారుగా అనేశాడు తేజు. ’చిత్రలహరి‘తో కథల ఎంపికలో తన తీరు మారిందని.. అక్కడ్నుంచి రొటీన్ సినిమాలు పక్కన పెట్టి వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్నానని చెప్పాడు తేజు. ఐతే మాస్ సినిమాలకు పూర్తిగా దూరంకానని.. అప్పుడప్పుడూ ఒకటి చేస్తానని.. సంపత్ నందితో చేసేది అలాంటి సినిమానే అని తేజు తెలిపాడు.
This post was last modified on July 19, 2023 11:21 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…