మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. తొలిసారిగా స్పోర్ట్స్ డ్రామాలో నటించడానికి అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కసరత్తులు చేసి, బాడీ మార్చుకుని, బాక్సింగ్ నేర్చుకుని సర్వ సన్నద్ధం అయ్యాడు.
ఐతే ఇక షూటింగ్ మొదలవడమే తరువాయి అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చి అడ్డం పడింది. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ను కథానాయికగా అనుకున్నారు. ఆమెను ఎంచుకుంటే సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనుకున్నారు.
కానీ డేట్లు కుదరకో.. ఆమె ఈ సినిమాకు సెట్ అవ్వదనో.. ఇంకో కారణంతోనో ఇప్పుడు ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. సయీ స్థానంలో బెంగళూరు భామ నభా నటేష్ను ఎంచుకున్నట్లు సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’తో తిరుగులేని పాపులారిటీ సంపాదించి, యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నభా అయితేనే ఈ సినిమాకు బాగుంటుందని ఫిక్సయ్యారట.
కాకపోతే వరుణ్ ముందు నభా కొంచెం పొట్టిగా అనిపించొచ్చు. అయినా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ నిర్మించనున్నాడు. అతడికి నిర్మాతగా ఇదే తొలి సినిమా. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్తో భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి బాబీ ప్రణాళికలు వేసుకున్నాడు.
This post was last modified on August 15, 2020 11:38 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…