Movie News

వరుణ్ సినిమా హీరోయిన్ని మార్చేశారా?

మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. తొలిసారిగా స్పోర్ట్స్ డ్రామాలో నటించడానికి అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కసరత్తులు చేసి, బాడీ మార్చుకుని, బాక్సింగ్ నేర్చుకుని సర్వ సన్నద్ధం అయ్యాడు.

ఐతే ఇక షూటింగ్ మొదలవడమే తరువాయి అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చి అడ్డం పడింది. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్‌ను కథానాయికగా అనుకున్నారు. ఆమెను ఎంచుకుంటే సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనుకున్నారు.

కానీ డేట్లు కుదరకో.. ఆమె ఈ సినిమాకు సెట్ అవ్వదనో.. ఇంకో కారణంతోనో ఇప్పుడు ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. సయీ స్థానంలో బెంగళూరు భామ నభా నటేష్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’తో తిరుగులేని పాపులారిటీ సంపాదించి, యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నభా అయితేనే ఈ సినిమాకు బాగుంటుందని ఫిక్సయ్యారట.

కాకపోతే వరుణ్ ముందు నభా కొంచెం పొట్టిగా అనిపించొచ్చు. అయినా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ నిర్మించనున్నాడు. అతడికి నిర్మాతగా ఇదే తొలి సినిమా. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి బాబీ ప్రణాళికలు వేసుకున్నాడు.

This post was last modified on August 15, 2020 11:38 am

Share
Show comments
Published by
satya

Recent Posts

కూటమి మేనిఫెస్టో విడుదల.. తొలి సంతకం ఆ ఫైలుపైనే

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…

22 mins ago

అన్న‌ను కార్న‌ర్ చేసిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్ చుట్టూ చిక్కులు!

ఒక్కొక్క‌సారి కొన్నికొన్ని విష‌యాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలా ప‌ట్టించుకుంటే.. మ‌న‌కేదో మేలు జ‌రుగుతుంద‌ని అనుకుంటే.. అదే పెద్ద త‌ప్పిదం అయి…

29 mins ago

సెన్సేషనల్ సినిమా కాపీ కొట్టి తీశారా

మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్'…

34 mins ago

పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా

ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాత‌త‌రానికి చెందిన నాయ‌కులు.. ఒక కులాన్ని ప్ర‌భావితం చేస్తార‌ని భావించే నాయ‌కులు ముఖ్యంగా…

43 mins ago

దర్శకుల ఉత్సవంలో ఊహించని మెరుపులు

మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…

2 hours ago

వారికి గాజు గ్లాసు గుర్తు ఎలా కేటాయిస్తారు?:  హైకోర్టు సీరియ‌స్‌

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాన పార్టీ జ‌న‌సేన‌కు కేటాయించిన గాజు గ్లాసు…

2 hours ago