ఎల్లుండి విడుదల కాబోతున్న హిడింబ మీద భారీ అంచనాలేం లేవు కానీ టీమ్ మాత్రం మౌత్ టాక్ నుంచే అనూహ్యంగా పుంజుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ఇలాంటి సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత చెప్పుకునేలా ఉండవు. అందుకే సమర్పకుడు అనిల్ సుంకర తనకు అచ్చి వచ్చిన ప్రీమియర్ సెంటిమెంట్ కి ఓటేశారు. సామజవరగమనకు బజ్ లేని టైంలో రెండు రోజుల ముందే తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ షోలు వేయడం చాలా హెల్ప్ అయ్యింది. దాని టాక్ సోషల్ మీడియా ద్వారా ఓపెనింగ్స్ కి దోహదపడింది
ఇప్పుడు హిడింబకు అదే ఫాలో అవుతున్నారు. ఇవాళ సాయంత్రమే పలు చోట్ల ప్రీమియర్లను వేస్తున్నారు. వైజాగ్, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల్లో 7 గంటలకు ప్రారంభమయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఖచ్చితంగా మెప్పిస్తుందనే ధీమా టీమ్ లో కనిపిస్తోంది. ఆ కారణంగానే ఇంత ముందుగా స్క్రీనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పైగా అనిల్ సుంకర సైతం ఇది సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు కాబోలు కొంత రిస్క్ ఉన్నా సరే ఎస్ అన్నారు.
ఒకరకంగా ఇది మంచి ఎత్తుగడే. ఎందుకంటే 21న పోటీ గట్టిగానే ఉంది. దూసుకుపోతున్న బేబీ రెండో వారంలోనూ తగ్గేలా లేదు. హాలీవుడ్ మూవీ ఓపెన్ హెయిమర్ కోసం అర్బన్ ఆడియన్స్ ఎగబడుతున్నారు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుంది. విజయ్ ఆంటోనీ హత్యకు హడావిడి లేకపోయినా స్లో పాయిజన్ లా ఎక్కొచ్చని నిర్మాతల నమ్మకం. ఇవి కాకుండా మరో నాలుగైదు చిన్న చిత్రాలున్నాయి. ఇంత కాంపిటేషన్ ఉన్నప్పుడు ప్రీమియర్లకు వెళ్లడం మంచిదే. నిన్న వచ్చిన రివర్స్ ట్రైలర్ కూడా బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది.
This post was last modified on July 18, 2023 11:34 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…