చిన్న హీరో సినిమాని పెద్ద బడ్జెట్ లో నిర్మించినప్పుడు రిస్క్ ఉంటుంది. కంటెంట్ బలంగా ఉందనే నమ్మకం కలిగించడంతో పాటు వీలైనంత పోటీ లేకుండా చూసుకోవాలి. ఈ గురువారం విడుదల కాబోతున్న హిడింబ ముందు నుంచి ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లరనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో రేపింది. స్వాతంత్రం రాకముందు నాటి పరిస్థితులను వర్తమానానికి ముడిపెట్టి దర్శకుడు అనీల్ కన్నెగంటి ఏదో విభిన్న ప్రయోగమైతే చేశాడు. విజువల్స్ గట్రా చాలా ఇంటెన్సిటీతో ఆసక్తి రేపెలా ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద హిడింబకు అవకాశాలు అవరోధాలు రెండూ స్వాగతం పలుకుతున్నాయి.
ముందు పోటీ సంగతి చూస్తే ఏ సెంటర్స్ లో క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ మూవీ ఒప్పెన్ హెయిమర్ మొదటి అడ్డంకిగా నిలుస్తోంది. కాకపోతే ఇది అన్ని వర్గాలకు టార్గెట్ చేసింది కాదు కాబట్టి రెగ్యులర్ మాస్ దీన్ని అంతగా పట్టించుకోరు. రెండోది బేబీ స్ట్రాంగ్ రన్. యువత ఎగబడి చూస్తుండటంతో అగ్రిమెంట్లు పొడిగించుకునేందుకు ఎగ్జిబిటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది కొంత ప్రభావం చూపొచ్చు. సురేష్ సంస్థ అండతో వస్తున్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో మీద పెద్దగా బజ్ లేదు. క్యాస్టింగ్ కన్నా క్వాలిటీని నమ్ముకుని టీమ్ సాహసం చేస్తోంది. విజయ్ ఆంటోనీ హత్యను తక్కువంచనా వేయడానికి లేదు.
ఇక అవకాశాల విషయానికి వస్తే హిడింబకున్న పెద్ద అడ్వాంటేజ్ జానర్. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్య సినిమాలు తగ్గాయి. కనెక్ట్ అయ్యేలా చూపిస్తే ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇస్తారని విరూపాక్ష నిరూపించింది. ఈ ఛాన్స్ అశ్విన్ బాబు మూవీకి ఉంది. పైగా సాంప్రదాయ ఫ్రైడే రిలీజ్ కు బదులు ఒక రోజు ముందే రావడం ప్లస్ అవ్వొచ్చు. టాక్ బాగుంటే రెండో రోజు నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నందితా శ్వేత, సిజ్జు తదితరులు కీలక పాత్రలు పోషించిన హిడింబకు రాజశేఖర్ ఛాయాగ్రహణం సమకూర్చగా వికాస్ సంగీతం అందించారు.యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ కి దీని సక్సెస్ చాలా కీలకం.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…