మంచి టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమాలు సైతం తొలి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్లో అయిపోతుంటాయి. వసూళ్లలో డ్రాప్ సహజం. సోమవారం 60-70 శాతం ఆక్యుపెన్సీలు వచ్చినా కూడా సినిమా చాలా బాగా ఆడుతున్నట్లే. చిన్న సినిమాలకు థియేటర్లు సగం నిండినా గొప్పగా చూస్తారు. కానీ ‘బేబి’ అనే చిన్న సినిమా.. వీకెండ్ తర్వాతి రోజు చూపిస్తున్న దూకుడు టాలీవుడ్కు పెద్ద షాకే.
చిన్న సినిమాల్లో కూడా పెద్ద విజయం సాధించినవి ఉన్నాయి కానీ.. ఈ సినిమా రేపుతున్న సంచలనం మాత్రం అలాంటిలాంటిది కాదు. సోమవారం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పడటం షాకింగే. మామూలుగా రాయలసీమలో మాస్ సినిమాలకు మాత్రమే సోమవారం వసూళ్లు నిలకడగా ఉంటాయి. కానీ ఈ చిన్న సినిమా ఆ మాస్ ఏరియాల్లో హౌస్ ఫుల్స్తో రన్ అవుతుండటం ట్రేడ్ పండిట్లకు కూడా పెద్ద షాకే.
తిరుపతి, కడప, కర్నూలు లాంటి సిటీల్లో ‘బేబి’కి మ్యాట్నీలు ఫుల్ అయ్యాయి. కడపలో ఈ సినిమా ఆడుతున్న రాజా థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు మ్యాట్నీకి. తిరుపతిలో ఒకటికి మించి థియేటర్లు ఫుల్ అయ్యాయి. కర్నూలులోనూ అదే పరిస్థితి. ఇక ఆంధ్రా ప్రాంతంలో చూస్తే వైజాగ్ లాంటి పెద్ద సిటీలోనే కాక చిన్న నగరాల్లో కూడా ‘బేబి’కి సోమవారం ఫుల్స్ పడటం విశేషం.
వైజాగ్లో మధ్యాహ్నం మూడు షోలూ ఫుల్ అయ్యాయి. నైజాం ఏరియాలో కూడా ‘బేబి’ దూకుడు చూపిస్తోంది. సిటీలో పలు థియేటర్లలో మధ్యాహ్నం మంచి ఆక్యుపెన్సీలు వచ్చాయి. కొన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి. సాయంత్రం, రాత్రి షోలకు మరింత మంచి ఆక్యుపెన్సీ ఉంటుందనడంలో సందేహం లేదు. వీక్ డేస్లో ఇంత బలంగా నిలబడిన చిన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండం. రోజు రోజుకూ రేంజి పెంచుకుంటూ వెళ్తున్న ‘బేబి’ ఫుల్ రన్లో ఏ స్థాయిలో నిలుస్తుందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది.
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…