తమిళంలో చిన్న చిన్న సహాయ, విలన్ పాత్రలతో తన కెరీర్ను ఆరంభించాడు విజయ్ సేతుపతి. కానీ ఇప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్లో అతనొకడు. భాషతో సంబంధం లేకుండా వేర్వేరు పరిశ్రమల్లో అతను కీలక పాత్రలు చేస్తున్నాడు. తెలుగులో ‘ఉప్పెన’లో విలన్ పాత్రతో మెస్మరైజ్ చేసిన అతను.. త్వరలోనే రామ్ చరణ్ మూవీలో నటించబోతున్నాడు.
హీరోగా కూడా సక్సెస్ అయినప్పటికీ.. తనకంటూ ఒక పరిధి గీసుకోకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ భిన్నమైన దారిలో సాగుతున్నాడతను. కొన్ని నెలల కిందటే వచ్చిన హిందీ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’లో సేతుపతి చేసిన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. బాలీవుడ్లో అతడికి మంచి గుర్తింపు తెచ్చింది. త్వరలోనే షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’లో అతను విలన్ పాత్రతో పలకరించబోతున్నాడు. అది బాలీవుడ్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
కాగా హిందీలో విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన సినిమా కూడా రాబోతోంది. ఆ సినిమా కాంబినేషనే చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ చిత్రం పేరు.. మెర్రీ క్రిస్మస్. బాలీవుడ్లో జానీ గద్దర్, బద్లాపూర్, అంధాదున్ లాంటి వెరైటీ సినిమాలతో దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో కత్రినా కైఫ్ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. విజయ్ సేతుపతికి ఆమె జంటగా నటించబోతోందా అనే విషయంలో క్లారిటీ లేదు. సేతుపతి, కత్రినా, శ్రీరామ్ రాఘవన్.. ఈ కాంబినేషన్ను అసలెవరూ ఊహించలేరు.
హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిస్మస్కు ముందు వీకెండ్లో డిసెంబరు 15న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదలయ్యే అవకాశముంది. శ్రీరామ్ రాఘవన్ ఎక్కువగా వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశాలతోనే సినిమాలు చేస్తుంటారు. ఆయన సినిమాలు ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఈసారి సేతుపతి లాంటి అద్భుత నటుడు దొరికిన నేపథ్యంలో తనను సరిగ్గా వాడుకుంటే సినిమా ఒక రేంజిలో ఉండొచ్చు.
This post was last modified on July 17, 2023 5:53 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…