టెక్నాలజీ వాడకంలో ఇండియా మొత్తం మీద దాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే దర్శకులు ఎవరంటే ఇద్దరి పేర్లే చెప్పాలి. ఒకరు రాజమౌళి రెండు శంకర్. కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి విడుదల సాధ్యం కాదని తేలిపోవడంతో వేసవికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కూడా దీని మీదే ఆధారపడి ఉంది. ఇదిలా ఉండగా ఇండియన్ 2 కోసం శంకర్ చనిపోయిన వాళ్ళను సాంకేతికత సహాయంతో తిరిగి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. అది కూడా చాలా సహజంగా అనిపించేలా.
వివరాల్లోకి వెళ్తే ఇండియన్ 2 మొదలుపెట్టేనాటికి కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు వివేక్ బ్రతికే ఉన్నారు. కొంత కీలక భాగం షూట్ చేశారు. తర్వాత ఆయన కాలం చేశారు. భారతీయుడు మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ గా ముఖ్యమైన పాత్ర పోషించిన మలయాళం నటుడు నెడుముడి వేణు సైతం కన్ను మూశారు. ఈయనతో కొన్ని సీన్లు తీశారు. ఇప్పుడు బ్యాలన్స్ మిగిలింది. రీ ప్లేస్ చేసి రీ షూట్ అంటే జరగని పని. అందుకే సహజత్వం కోసం బాడీ డబుల్స్ ని వాడి కొత్త తరహా హాలీవుడ్ టెక్నాలజీతో నిజంగా వాళ్ళు మళ్ళీ వచ్చారా అనిపించేలా తీయబోతున్నట్టు చెన్నై టాక్.
నిజంగానే ఇదో అరుదైన ఘట్టమనే చెప్పాలి. గతంలో కలిసుందాం రా, యమదొంగ సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ రూపంలో మళ్ళీ తీసుకొచ్చి పాటల్లో చూపించారు . కానీ ఇండియన్ 2లో అలా కాదు. లేని ఆర్టిస్టుతో కొత్త సన్నివేశాలు తీయాలి. ఇది ఒక రకంగా కత్తి మీద సామే. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. అన్నట్టు కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా కనిపించే ఎపిసోడ్ కి సైతం సిజిని వాడబోతున్నారు . చూస్తుంటే చాలా గ్యాప్ తర్వాత శంకర్ సోషల్ మెసేజ్ తో పాటు అబ్బురపరిచే ఎఫెక్ట్స్ తో ఏదో మేజిక్ చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on July 17, 2023 8:10 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…