టెక్నాలజీ వాడకంలో ఇండియా మొత్తం మీద దాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే దర్శకులు ఎవరంటే ఇద్దరి పేర్లే చెప్పాలి. ఒకరు రాజమౌళి రెండు శంకర్. కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి విడుదల సాధ్యం కాదని తేలిపోవడంతో వేసవికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కూడా దీని మీదే ఆధారపడి ఉంది. ఇదిలా ఉండగా ఇండియన్ 2 కోసం శంకర్ చనిపోయిన వాళ్ళను సాంకేతికత సహాయంతో తిరిగి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. అది కూడా చాలా సహజంగా అనిపించేలా.
వివరాల్లోకి వెళ్తే ఇండియన్ 2 మొదలుపెట్టేనాటికి కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు వివేక్ బ్రతికే ఉన్నారు. కొంత కీలక భాగం షూట్ చేశారు. తర్వాత ఆయన కాలం చేశారు. భారతీయుడు మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ గా ముఖ్యమైన పాత్ర పోషించిన మలయాళం నటుడు నెడుముడి వేణు సైతం కన్ను మూశారు. ఈయనతో కొన్ని సీన్లు తీశారు. ఇప్పుడు బ్యాలన్స్ మిగిలింది. రీ ప్లేస్ చేసి రీ షూట్ అంటే జరగని పని. అందుకే సహజత్వం కోసం బాడీ డబుల్స్ ని వాడి కొత్త తరహా హాలీవుడ్ టెక్నాలజీతో నిజంగా వాళ్ళు మళ్ళీ వచ్చారా అనిపించేలా తీయబోతున్నట్టు చెన్నై టాక్.
నిజంగానే ఇదో అరుదైన ఘట్టమనే చెప్పాలి. గతంలో కలిసుందాం రా, యమదొంగ సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ రూపంలో మళ్ళీ తీసుకొచ్చి పాటల్లో చూపించారు . కానీ ఇండియన్ 2లో అలా కాదు. లేని ఆర్టిస్టుతో కొత్త సన్నివేశాలు తీయాలి. ఇది ఒక రకంగా కత్తి మీద సామే. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. అన్నట్టు కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా కనిపించే ఎపిసోడ్ కి సైతం సిజిని వాడబోతున్నారు . చూస్తుంటే చాలా గ్యాప్ తర్వాత శంకర్ సోషల్ మెసేజ్ తో పాటు అబ్బురపరిచే ఎఫెక్ట్స్ తో ఏదో మేజిక్ చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on July 17, 2023 8:10 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…