ఈ ఏడాది టాలీవుడ్ వేసవి ఎంత డల్లుగా సాగిందో తెలిసిందే. దసరా, విరూపాక్ష లాంటి రెండు మూడు సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు రాబట్టాయి. చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. ఐతే సమ్మర్ సీజన్ ముగిశాక ‘ఆదిపురుష్’తో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర కొంచెం సందడి నెలకొంది. కానీ ఆ సందడి ఒక్క వీకెండ్కే పరిమితం అయింది.
తర్వాతి రెండు వారాల్లో వచ్చిన సినిమాలన్నీ తుస్సుమనిపించి.. థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా రాలేదు. ఐతే జూన్ నెలాఖర్లో టాలీవుడ్ బాక్సాఫీస్కు మంచి ఉత్సాహాన్నిస్తూ.. ‘సామజవరగమన’ అనే చిన్న సినిమా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా స్థాయికి మించి కలెక్షన్లు తెచ్చుకుంది. ఈ చిన్న చిత్రం గ్రాస్ కలెక్షన్లు రూ.45 కోట్లను దాటిపోవడం విశేషం. మూడో వారంలో కూడా ఈ సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి.
‘సామజవరగమన’ రెండు వారాల పాటు బాక్సాఫీస్ను పోషించగా.. ఈ వారం ‘బేబి’ దాన్నుంచి బ్యాటన్ అందుకుంది. ఈ చిత్రం సంచలన ఓపెనింగ్స్తో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఆదివారం కూడా మంచి ఊపు కనిపిస్తోంది. దీంతో పాటు రిలీజైన ‘మహావీరుడు’ కూడా పర్వాలేదనిపిస్తోంది. ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి.
ఇక వచ్చే వారం రిలీజ్ కానున్న సినిమాల్లో ‘హిడింబ’కు మంచి హైప్ కనిపిస్తోంది. ఆ చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తోంది. టాక్ బాగుంటే అది వీకెండ్ విన్నర్ కావచ్చు. ఇక జులై చివరి వారంలో ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా రానుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చెప్పేదేముంది? ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో జైలర్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలు విడులవుతున్నాయి. కాబట్టి ఇంకో నెల రోజుల పాటు బాక్సాఫీస్ కళకళలాడటం ఖాయం.
This post was last modified on July 17, 2023 12:51 pm
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో…
ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో…
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో…
ఇంకో రెండు రోజుల్లో రాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. మూడు నిమిషాల…
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారా? ప్రస్తుతం ఇస్తున్న పథకాలను మరింత పెంచనున్నారా? అంటే…
లోక నాయకుడు కమల్ హాసన్ తమిళనాడు సీఎం, సహనటుడు విజయ్ ని కలిశారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ…