ఈ ఏడాది టాలీవుడ్ వేసవి ఎంత డల్లుగా సాగిందో తెలిసిందే. దసరా, విరూపాక్ష లాంటి రెండు మూడు సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు రాబట్టాయి. చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. ఐతే సమ్మర్ సీజన్ ముగిశాక ‘ఆదిపురుష్’తో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర కొంచెం సందడి నెలకొంది. కానీ ఆ సందడి ఒక్క వీకెండ్కే పరిమితం అయింది.
తర్వాతి రెండు వారాల్లో వచ్చిన సినిమాలన్నీ తుస్సుమనిపించి.. థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా రాలేదు. ఐతే జూన్ నెలాఖర్లో టాలీవుడ్ బాక్సాఫీస్కు మంచి ఉత్సాహాన్నిస్తూ.. ‘సామజవరగమన’ అనే చిన్న సినిమా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా స్థాయికి మించి కలెక్షన్లు తెచ్చుకుంది. ఈ చిన్న చిత్రం గ్రాస్ కలెక్షన్లు రూ.45 కోట్లను దాటిపోవడం విశేషం. మూడో వారంలో కూడా ఈ సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి.
‘సామజవరగమన’ రెండు వారాల పాటు బాక్సాఫీస్ను పోషించగా.. ఈ వారం ‘బేబి’ దాన్నుంచి బ్యాటన్ అందుకుంది. ఈ చిత్రం సంచలన ఓపెనింగ్స్తో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఆదివారం కూడా మంచి ఊపు కనిపిస్తోంది. దీంతో పాటు రిలీజైన ‘మహావీరుడు’ కూడా పర్వాలేదనిపిస్తోంది. ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి.
ఇక వచ్చే వారం రిలీజ్ కానున్న సినిమాల్లో ‘హిడింబ’కు మంచి హైప్ కనిపిస్తోంది. ఆ చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తోంది. టాక్ బాగుంటే అది వీకెండ్ విన్నర్ కావచ్చు. ఇక జులై చివరి వారంలో ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా రానుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చెప్పేదేముంది? ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో జైలర్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలు విడులవుతున్నాయి. కాబట్టి ఇంకో నెల రోజుల పాటు బాక్సాఫీస్ కళకళలాడటం ఖాయం.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…