Movie News

సెన్సేషనల్ హీరోయిన్.. తొలి పారితోషకం 700

వైష్ణవి చైతన్య.. ఇప్పుడు టాలీవుడ్లో ఈ అమ్మాయి పేరు హాట్ టాపిక్. ‘బేబి’ సినిమాలో తన పెర్ఫామెన్స్ అందరికీ పెద్ద షాక్. కథానాయికగా తొలి సినిమాలో ఆమె తన పాత్రలో చూపించిన వేరియేషన్లు.. తన బోల్డ్ యాక్ట్స్.. కొన్ని ఎపిసోడ్లలో నటన ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ఒక తెలుగు హీరోయిన్ లీడ్ రోల్ చేసిన తొలి చిత్రంలో ఇచ్చిన బెస్ట్ పెర్ఫామెన్స్‌ల్లో ఇదొకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఐతే ఫీచర్ ఫిలిమ్స్ మాత్రమే చూసేవాళ్లకు వైష్ణవి కొత్త కావచ్చు కానీ.. టిక్ టాక్‌ను అనుసరించిన వాళ్లకు.. యూట్యూబ్ షార్ట్స్ చూసేవాళ్లకు ఆమె కొత్త కాదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌’ చూసిన వాళ్లు ఆమెతో బాగా కనెక్ట్ అయ్యారు. ‘అల వైకుంఠపురములో’లో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రను కూడా పోషించింది వైష్ణవి. ఐతే ఆమెకు తొలిసారి గుర్తింపు వచ్చింది మాత్రం టిక్ టాక్ వీడియోలతోనే.

అలా సంపాదించిన గుర్తింపుతో కెరీర్ ఆరంభించిన తాను అందుకున్న తొలి పారితోషకం కేవలం ఏడొందలు అని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం రాగా.. రోజంతా చాలా కష్టపడి డ్యాన్స్ చేస్తే.. ఏడొందల రూపాయలు ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఎంత సంపాదించినా ఆ ఏడొందలే తనకు చాలా స్పెషల్ అని వైష్ణవి వెల్లడించింది.

‘బేబి’ సినిమాలో తన పాత్రకు వస్తున్న గుర్తింపు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పిన ఆమె.. ఇందులో లిప్ లాక్, ఇతర రొమాంటిక్ సీన్ల విషయంలో తన ఫ్యామిలీ ఎలా స్పందించిందనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఆ సీన్లు చేస్తున్నపుడు టీం అంతా తనను చాలా కంఫర్ట్‌గా ఉంచిందని.. సినిమా అంతా చూసేసరికి ఎవరికీ ఆ సీన్ గుర్తుండదని.. ప్రేక్షకుల్లాగే తన కుటుంబ సభ్యుల్లాగే దాన్ని పెద్ద విషయం లాగా చూడలేదని వైష్ణవి పేర్కొంది.

This post was last modified on July 16, 2023 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

42 minutes ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

3 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

3 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

4 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

4 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

6 hours ago