ఇండియన్ సినిమాలో తర్వాతి బిగ్ రిలీజ్ అంటే.. ‘సలార్’యే. గత నెలలో ‘ఆదిపురుష్’ మూవీతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఒక వీకెండ్ పాటు సందడి తీసుకొచ్చిన ప్రభాస్.. ‘సలార్’తో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం అనుకుంటున్నారు. వివిధ భాషల్లో ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ‘సలార్’ నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేస్తే ఒక రెండ్రోజుల పాటు సోషల్ మీడియా వేడెక్కిపోయింది.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కావడం, ప్రభాస్ ఇమేజ్కు తగ్గ పక్కా మాస్ బొమ్మ కావడంతో ‘సలార్’ మిస్ ఫైర్ అయ్యే అవకాశాలే ఉండవని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సిినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బిజినెస్ కూడా ఒక రేంజిలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. హైప్ను నిర్మాతలు క్యాష్ చేసుకునే క్రమంలో అసాధారణ రేట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ-తెలంగాణకు కలిపి రూ.200 కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్నారట నిర్మాతలు.
ఐతే ప్రభాస్ గత మూడు చిత్రాల తాలూకు చేదు అనుభవాల దృష్ట్యా ‘సలార్’ను అంతేసి రేట్లు పెట్టి కొనడంపై డిస్ట్రిబ్యూటర్లు తటపటాయిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా నిండా మునగడం ఖాయమని అనుకుంటున్నారు. ఐతే తాము కోరుకున్న రేట్లు రాకపోతే కమిషన్ బేసిస్ మీద సొంతంగా రిలీజ్ చేసుకోవడానికి ‘సలార్’ నిర్మాతలు వెనుకాడట్లేదట. ప్రభాస్ గత సినిమాలతో దీనికి పోలిక లేదని.. ఇది మినిమం గ్యారెంటీ సినిమా అని.. ‘కేజీఎఫ్’ను మించి అద్భుతాలు చేస్తుందని.. ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటాయని వాళ్లు భావిస్తున్నారట.
సొంతంగా రిలీజ్ చేసుకుంటే తాము అనుకున్న టార్గెట్ను మించి ఆదాయం రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారట. తెలంగాణ వరకు సినిమాను అనుకున్న రేటుకి అమ్మడం కష్టం కాకపోవచ్చని.. ఏపీలో ఇబ్బంది తలెత్తితే మాత్రం సొంతంగా రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. అవసరమైతే తెలంగాణలోనూ ఓన్ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారట. మరి ఇది కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో చూడాలి.
This post was last modified on July 15, 2023 7:58 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…