ఇండియన్ సినిమాలో తర్వాతి బిగ్ రిలీజ్ అంటే.. ‘సలార్’యే. గత నెలలో ‘ఆదిపురుష్’ మూవీతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఒక వీకెండ్ పాటు సందడి తీసుకొచ్చిన ప్రభాస్.. ‘సలార్’తో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం అనుకుంటున్నారు. వివిధ భాషల్లో ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ‘సలార్’ నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేస్తే ఒక రెండ్రోజుల పాటు సోషల్ మీడియా వేడెక్కిపోయింది.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కావడం, ప్రభాస్ ఇమేజ్కు తగ్గ పక్కా మాస్ బొమ్మ కావడంతో ‘సలార్’ మిస్ ఫైర్ అయ్యే అవకాశాలే ఉండవని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సిినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బిజినెస్ కూడా ఒక రేంజిలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. హైప్ను నిర్మాతలు క్యాష్ చేసుకునే క్రమంలో అసాధారణ రేట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ-తెలంగాణకు కలిపి రూ.200 కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్నారట నిర్మాతలు.
ఐతే ప్రభాస్ గత మూడు చిత్రాల తాలూకు చేదు అనుభవాల దృష్ట్యా ‘సలార్’ను అంతేసి రేట్లు పెట్టి కొనడంపై డిస్ట్రిబ్యూటర్లు తటపటాయిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా నిండా మునగడం ఖాయమని అనుకుంటున్నారు. ఐతే తాము కోరుకున్న రేట్లు రాకపోతే కమిషన్ బేసిస్ మీద సొంతంగా రిలీజ్ చేసుకోవడానికి ‘సలార్’ నిర్మాతలు వెనుకాడట్లేదట. ప్రభాస్ గత సినిమాలతో దీనికి పోలిక లేదని.. ఇది మినిమం గ్యారెంటీ సినిమా అని.. ‘కేజీఎఫ్’ను మించి అద్భుతాలు చేస్తుందని.. ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటాయని వాళ్లు భావిస్తున్నారట.
సొంతంగా రిలీజ్ చేసుకుంటే తాము అనుకున్న టార్గెట్ను మించి ఆదాయం రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారట. తెలంగాణ వరకు సినిమాను అనుకున్న రేటుకి అమ్మడం కష్టం కాకపోవచ్చని.. ఏపీలో ఇబ్బంది తలెత్తితే మాత్రం సొంతంగా రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. అవసరమైతే తెలంగాణలోనూ ఓన్ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారట. మరి ఇది కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో చూడాలి.
This post was last modified on July 15, 2023 7:58 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…