లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాల కడగండ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లా జెల్లాతోపాటు తట్టా బుట్టా నెత్తినబెట్టుకొని వందల కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ సొంతూళ్లకు పయనమైన వారి దయనీయ స్థితి ఎందరినో కన్నీళ్లు పెట్టించింది. అటువంటి వారికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో తమకు తోచిన సాయం చేశారు. అయితే, వారందరిలోకెల్లా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. వలస కూలీల పాలిట ఈ బాలీవుడ్ విలన్ హీరో అయ్యాడు. వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేయడం మొదలు విమానాల్లో వారిని తరలించడం వరకు ఎన్నో రకాలుగా సాయం చేసి తన దయాగుణాన్ని చాటుకున్నాడు. ఇప్పటికీ సాయం కోరిన వారికి సోనూ సూద్ తన ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నాడు. తాజాగా సోనూ సూద్ తరహాలోనే టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా అవసరం అన్న వారికి సాయం చేస్తున్నారు.
తనను సాయం అడిగినవాళ్లకు కాదనకుండా ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారు. కొందరికి ఉద్యోగాలిప్పించిన బండ్ల గణేష్…మరి కొందరికి తోచిన ఆర్థిక సాయం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. మణికాంత్ అనే కుర్రాడు ఇంటర్ చదివానని, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఉద్యోగం చేయాలనుకుంటున్నానని బండ్ల గణేశ్ కు ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన బండ్ల గణేష్…ఓ సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ తన పేరు చెబితే ఉద్యోగం ఇస్తారని చెప్పారు. అదే తరహాలో…ఎంబీఏ ఫైనాన్స్ చదివిన మరో యువకుడికి ఫోన్ నెంబర్ ఉద్యోగానికి సిఫారసు చేశారు. నిరుద్యోగంతో కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడిన మరో యువకుడికి విద్యార్హతలను బట్టి ఉద్యోగం ఇప్పిస్తానని బండ్ల గణేశ్ భరోసా ఇచ్చారు. వీరితోపాటు, కరోనా సోకిన ఓ రిపోర్టర్ కు ఫోన్ పే ద్వారా ఆర్థికసాయం అందించారు. ఇలా, సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్…తన సాయం అడిగిన వారికి ఆపన్న హస్తం అందిస్తూ టాలీవుడ్ సోనూ సూద్ గా మారుతున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
This post was last modified on August 15, 2020 12:55 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…