లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాల కడగండ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లా జెల్లాతోపాటు తట్టా బుట్టా నెత్తినబెట్టుకొని వందల కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ సొంతూళ్లకు పయనమైన వారి దయనీయ స్థితి ఎందరినో కన్నీళ్లు పెట్టించింది. అటువంటి వారికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో తమకు తోచిన సాయం చేశారు. అయితే, వారందరిలోకెల్లా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. వలస కూలీల పాలిట ఈ బాలీవుడ్ విలన్ హీరో అయ్యాడు. వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేయడం మొదలు విమానాల్లో వారిని తరలించడం వరకు ఎన్నో రకాలుగా సాయం చేసి తన దయాగుణాన్ని చాటుకున్నాడు. ఇప్పటికీ సాయం కోరిన వారికి సోనూ సూద్ తన ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నాడు. తాజాగా సోనూ సూద్ తరహాలోనే టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా అవసరం అన్న వారికి సాయం చేస్తున్నారు.
తనను సాయం అడిగినవాళ్లకు కాదనకుండా ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారు. కొందరికి ఉద్యోగాలిప్పించిన బండ్ల గణేష్…మరి కొందరికి తోచిన ఆర్థిక సాయం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. మణికాంత్ అనే కుర్రాడు ఇంటర్ చదివానని, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఉద్యోగం చేయాలనుకుంటున్నానని బండ్ల గణేశ్ కు ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన బండ్ల గణేష్…ఓ సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ తన పేరు చెబితే ఉద్యోగం ఇస్తారని చెప్పారు. అదే తరహాలో…ఎంబీఏ ఫైనాన్స్ చదివిన మరో యువకుడికి ఫోన్ నెంబర్ ఉద్యోగానికి సిఫారసు చేశారు. నిరుద్యోగంతో కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడిన మరో యువకుడికి విద్యార్హతలను బట్టి ఉద్యోగం ఇప్పిస్తానని బండ్ల గణేశ్ భరోసా ఇచ్చారు. వీరితోపాటు, కరోనా సోకిన ఓ రిపోర్టర్ కు ఫోన్ పే ద్వారా ఆర్థికసాయం అందించారు. ఇలా, సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్…తన సాయం అడిగిన వారికి ఆపన్న హస్తం అందిస్తూ టాలీవుడ్ సోనూ సూద్ గా మారుతున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
This post was last modified on August 15, 2020 12:55 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…