గత ఏడాది కాలంలో ఎన్నో పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా వరకు స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ మూవీసే ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు వాటిని ఓన్ చేసుకుని చాలా హంగామా చేస్తూ వచ్చారు. ఐతే ఇలాంటి పెద్ద సినిమాల మధ్య కొన్ని చిన్న సినిమాలు.. స్టార్ హీరోల ఫ్యాన్స్ హడావుడి లేకుండానే రీ రిలీజ్లో సత్తా చాటాయి. అందులో తమిళ అనువాద చిత్రం 3.. తరుణ్ భాస్కర్ మూవీ ఈ నగరానికి ఏమైంది లాంటివి ఉన్నాయి.
ముఖ్యంగా ఈ మధ్యే రీ రిలీజ్ అయిన ఈ నగరానికి ఏమైంది యూత్ దృష్టిని బాగా ఆకర్షించింది. సినిమాకు ఎవరూ ఊహించని స్థాయిలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. మంచి వసూళ్లు కూడా వచ్చాయి. త్వరలో ఇలాగే ఇంకో కల్ట్ కామెడీ మూవీ ప్రేక్షకులను అలరించబోతోంది. అదే.. వెంకీ. మాస్ రాజా రవితేజ హీరోగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమా వెంకీ. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు కావస్తోంది కానీ.. ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ కామెడీ అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలోని అనేక సీన్లు, డైలాగులు ఇప్పటికీ మీమ్స్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఈ చిత్రంలో రవితేజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆయనతో కలిసి బ్రహ్మానందం, ఏవీఎస్ తదితరులు కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు ప్రేక్షకులను. ఇందులో పాటలు కూడా అదిరిపోతాయి. ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా 2023 డిసెంబరు 30 నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. రవితేజ ఫ్యాన్స్ అనే కాదు.. తెలుగు సినిమా కామెడీ ప్రియులందరూ ఈ సినిమా చూసి నోస్టాల్జిక్ ఫీలింగ్ పొందే అవకాశముంది. ఈ సినిమాలో కేవలం ఒక్క ట్రైనన్ ఎపిసోడ్ చాలు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.
This post was last modified on October 8, 2023 4:35 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…