గత ఏడాది కాలంలో ఎన్నో పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా వరకు స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ మూవీసే ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు వాటిని ఓన్ చేసుకుని చాలా హంగామా చేస్తూ వచ్చారు. ఐతే ఇలాంటి పెద్ద సినిమాల మధ్య కొన్ని చిన్న సినిమాలు.. స్టార్ హీరోల ఫ్యాన్స్ హడావుడి లేకుండానే రీ రిలీజ్లో సత్తా చాటాయి. అందులో తమిళ అనువాద చిత్రం 3.. తరుణ్ భాస్కర్ మూవీ ఈ నగరానికి ఏమైంది లాంటివి ఉన్నాయి.
ముఖ్యంగా ఈ మధ్యే రీ రిలీజ్ అయిన ఈ నగరానికి ఏమైంది యూత్ దృష్టిని బాగా ఆకర్షించింది. సినిమాకు ఎవరూ ఊహించని స్థాయిలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. మంచి వసూళ్లు కూడా వచ్చాయి. త్వరలో ఇలాగే ఇంకో కల్ట్ కామెడీ మూవీ ప్రేక్షకులను అలరించబోతోంది. అదే.. వెంకీ. మాస్ రాజా రవితేజ హీరోగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమా వెంకీ. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు కావస్తోంది కానీ.. ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ కామెడీ అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలోని అనేక సీన్లు, డైలాగులు ఇప్పటికీ మీమ్స్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఈ చిత్రంలో రవితేజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆయనతో కలిసి బ్రహ్మానందం, ఏవీఎస్ తదితరులు కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు ప్రేక్షకులను. ఇందులో పాటలు కూడా అదిరిపోతాయి. ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా 2023 డిసెంబరు 30 నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. రవితేజ ఫ్యాన్స్ అనే కాదు.. తెలుగు సినిమా కామెడీ ప్రియులందరూ ఈ సినిమా చూసి నోస్టాల్జిక్ ఫీలింగ్ పొందే అవకాశముంది. ఈ సినిమాలో కేవలం ఒక్క ట్రైనన్ ఎపిసోడ్ చాలు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.
This post was last modified on October 8, 2023 4:35 pm
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…