ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఓపెన్ హెయిమర్ ప్రీ రిలీజ్ ప్రీమియర్ రివ్యూస్ బయటికి వచ్చేశాయి. కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మీడియా ప్రతినిధులతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలకు స్పెషల్ షోలు వేశారు. ఎలాంటి విఎఫ్ఎక్స్ వాడకుండా మూడు గంటల నిడివి ఉన్న సినిమా తీశానని క్రిస్టోఫర్ నోలన్ చెప్పడం ఇతర ఫిలిం మేకర్స్ ని విస్మయానికి గురి చేసింది. పైగా ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మట్ తో షూట్ చేయడంతో పాటు దశాబ్దాల నాటి నెగటివ్ రీలు టెక్నాలజీ వాడటం మరో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ముందస్తు సమీక్షలు ఏమంటున్నాయి.
నోలన్ ఇప్పటిదాకా తీసినవాటిలో ఇదే అత్యంత ఘాఢత ఉన్న నేపథ్యం. కాకపోతే టెనెట్ లాగా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే లేకుండా సులభంగా అర్థమయ్యేలా కథనాన్ని రూపొందించారు. లుడ్విగ్ గొరాన్ సన్ నేపధ్య సంగీత సంగీతం ప్రధాన హైలైట్స్ లో ఒకటి. సాంకేతికంగా క్రిస్టోఫర్ మరోసారి తన అత్యుత్తమ ప్రతిభను ఋజువు చేసుకున్నారు. చివరి అరవై నిముషాలు ఆడియన్స్ అందరితోనూ ఏకాభిప్రాయం వచ్చేలా మెప్పించలేకపోయినా మొదటి రెండు గంటలు మాత్రం నోలన్ ని ఇష్టపడని వాళ్ళు కూడా ప్రేమిస్తారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కు చోటు ఇవ్వలేదు.
సుదీర్ఘమైన డైలాగులున్న సీన్లు చాలా ఉన్నాయి. అర్థం చేసుకుంటే అబ్బురపడాల్సిందే. లేదంటే బోర్ కొట్టిస్తాయి. ఆర్టిస్టుల్లో ఎమిలీ బ్లంట్ తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేస్తారు. సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనేలు పోటాపోటీగా నటించారు. న్యూక్లియర్ విధ్వంసంని నేపథ్యంగా తీసుకున్న క్రిస్టోఫర్ నోలన్ దానికి రాజకీయ అంశాలను జోడించడం బాగుంది. ఇవన్నీ విదేశీయుల అనుభూతిని ఆధారంగా వచ్చిన ఫీడ్ బ్యాక్. మనకు ఇంకోలా అనిపించవచ్చు. ఇప్పటికే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో ట్రేడ్ కి షాక్ ఇస్తున్న ఓపెన్ హెయిమర్ ఇండియా వైడ్ థియేటర్లలో 21వ తేదీన గ్రాండ్ గా అడుగు పెట్టనుంది.
This post was last modified on July 13, 2023 6:46 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…