ఆర్ఆర్ఆర్ తర్వాత ఆలస్యం చేయకుండా గేమ్ఛేంజర్ సినిమాను మొదలుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దాని తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులైంది. ఆ తర్వాత ఏ అప్డేట్ లేదు. ఐతే ఈ సినిమా టీం నుంచి వరుస అనౌన్స్మెంట్లు రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చరణ్ 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడని చాన్నాళ్ల ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమాచారమే నిజమని తేలిపోయింది.
స్వయంగా రెహమానే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాకు తాను పని చేస్తున్నానని.. ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నానని రెహమాన్ తెలిపాడు. ఉప్పెన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాలనుకున్నాడు బుచ్చిబాబు. ఆ సినిమా ఒక దశలో ఖరారైంది కూడా. అప్పుడే రెహమాన్తో అతను సంగీత చర్చలు మొదలుపెట్టాడు. కానీ తర్వాత తారక్కు వేరే కమిట్మెంట్లు ఉండటంతో బుచ్చిబాబు సినిమా నుంచి వైదొలిగాడు.
తారక్తో చేయాలనుకున్న కథో, మరొకటో కానీ.. చరణ్తో బుచ్చిబాబు సినిమాను ఓకే చేసుకున్నాడు. హీరో మారినా.. సంగీత దర్శకుడిగా మాత్రం రెహమాన్నే పెట్టుకోవాలని అతను ఫిక్సయ్యాడు. ఈ చిత్రంలో ఉప్పెన విలన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించనుండగా.. జాన్వి కపూర్ కథానాయికగా ప్రచారంలో ఉంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని.. చాలా ఇంటెన్స్గా ఉంటుందని.. చరణ్ ఇందులో స్పోర్ట్స్ మన్ టర్న్డ్ కోచ్గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on July 13, 2023 12:09 am
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…