Movie News

మణిశర్మ లేకుండా పూరీ పెద్ద రిస్క్

టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో పూరీ- మణిశర్మ కాంబో ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ ఆల్బమ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమాకి మణి శర్మ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. కొన్నేళ్ళుగా ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ మణిశర్మ ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు. ఆ సినిమాకు అదిరిపోయే సాంగ్స్ తో పాటు ఎలివేట్ చేసే స్కోర్ అందించాడు. 

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ తో షూటింగ్ మొదలైన పూరీ -రామ్ కాంబినేషన్ సినిమాకు మణి శర్మ నే మ్యూజిక్ ఇస్తారని అందరూ ఊహించారు. కానీ ఈ క్రేజీ సీక్వెల్ కి మణిశర్మ మ్యూజిక్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. దీనికి కారణం పూరీ -మణి మధ్యలో ఉన్న విబేధాలని ఇన్ సైడ్ టాక్. ‘ఇస్మార్ట్ శంకర్’ మ్యూజిక్ తర్వాత మణిశర్మ దాదాపు పది సినిమాల అవకాశాలు అందుకున్నాడు. ఆ సినిమా సాంగ్స్ తో మణి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తోనే చిరు ‘ఆచార్య’ కి అవకాశం ఇచ్చారు. 

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ- మణిశర్మ ఇద్దరికీ చెడినట్టు తెలుస్తుంది. అందుకే పూరీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి మణిశర్మ కాకుండా మరో సంగీత దర్శకుడిని లాక్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడట. తమన్ లేదా అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చి సక్సెస్ లో కీ రోల్ పోషించిన మణిశర్మ ను పక్కన పెట్టేసి పూరీ మరో మ్యూజిక్ డైరెక్టర్ తో పెద్ద రిస్కే చేస్తున్నట్టే. డబుల్ ఇస్మార్ట్ కి మణిశర్మ ను మ్యాచ్ చేసే మ్యూజిక్ ఇవ్వాలంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కయినా పెద్ద ఛాలెంజే.

This post was last modified on July 12, 2023 8:28 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

44 minutes ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

59 minutes ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

2 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

2 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

2 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

3 hours ago