Movie News

వారసుడి ఎంట్రీకి బాలయ్య ప్లాన్

నందమూరి అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతున్న మోక్షజ్ఞ వెండితెర ప్రవేశం గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాధ్ పేరు తొలుత వినిపించింది. ఆ తర్వాత బోయపాటి శీను ఒక కథ సిద్ధం చేశారని ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ గాసిప్స్ రూపంలో తిరుగుతున్నాయి తప్పించి ఫలానా సమయంలో టాలీవుడ్ ఎంట్రీ చేయిస్తారనే క్లారిటీ మాత్రం రాలేదు. ఇటీవలే జరిగిన నాసా సభలకు అతిథిగా వెళ్లిన బాలకృష్ణ అక్కడి ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల వారసుడి రాక గురించి కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలిసింది.

దాని ప్రకారం వచ్చే ఏడాది ఆదిత్య 369 సీక్వెల్ ని తన దర్శకత్వంలోనే మొదలుపెట్టి, అందులో మోక్షజ్ఞకి కీలకమైన పాత్ర ఇస్తానని, హీరో తనే అయినప్పటికీ దానికి సమానంగా కొడుక్కి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారట. అయితే సోలోగా కాకుండా ఇలా చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఆరా తీస్తే దానికో లాజిక్ ఉందట. బాలయ్య మొదటి చిత్రం తాతమ్మ కల దర్శకుడు స్వయానా తండ్రి ఎన్టీఆరే. ఆ సెంటిమెంట్ బ్రహ్మాండంగా పండి తర్వాత క్రమంగా స్టార్ గా ఎదగడానికి దోహదపడింది. కెరీర్ తొలినాళ్ళలో బాలకృష్ణ నాన్న డైరెక్షన్లో చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు

ఈ లెక్కన మోక్షజ్ఞని స్క్రీన్ మీద చూడాలంటే 2025 దాకా ఆగక తప్పేలా లేదు. కొద్దిరోజుల క్రితం బాగా సన్నబడిన మోక్షజ్ఞ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కథానాయకుడిగా కనిపించాల్సిన ఫిట్ నెస్ వచ్చేసిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. తగినంత శిక్షణ మరోసారి తీసుకుని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి మోక్షజ్ఞని లాంచ్ చేయాలనే ప్లాన్ కు కొంత టైం అయితే పట్టేలా ఉంది. ఆదిత్య  999కు కథ సిద్ధంగానే ఉందట. ఫస్ట్ పార్ట్ తీసిన సింగీతం శ్రీనివాసరావు దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకుని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయించే పనిని బాలయ్య త్వరలోనే మొదలుపెట్టొచ్చు. 

This post was last modified on July 12, 2023 8:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago