ప్రభాస్ హీరో అయింది ‘ఈశ్వర్’తో అయినా కానీ బ్రేక్ వచ్చింది ‘వర్షం’తోనే. ఆ సినిమాతోనే ప్రభాస్ యువతరానికి హార్ట్ త్రోబ్ అయ్యాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శోభన్తో ప్రభాస్కి మంచి అనుబంధం వుంది. అయితే శోభన్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు సంతోష్ శోభన్ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు. తను నేను, పేపర్బోయ్ చిత్రాల్లో హీరోగా నటించిన సంతోష్ శోభన్కి హీరోగా బ్రేక్ రాలేదు.
దాంతో ప్రభాస్ తన హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్లో అతడితో ఒక సినిమా తీసి హీరోగా నిలబెట్టాలని తన స్నేహితులపై బాధ్యత పెట్టాడు. అందుకే అతని కోసమని యువి క్రియేషన్స్ ఒక చిన్న సినిమా తీస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే ‘ఎక్స్ప్రెస్ రాజా’ దర్శకుడి నుంచి తీసుకుని కార్తీక్ అనే యువ దర్శకుడి చేతిలో సినిమా పెట్టింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచనతో లిమిటెడ్ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇది కానీ సక్సెస్ అనిపించుకుంటే ఇక ఓటిటి సినిమాలకు, వెబ్ సిరీస్లకు సంతోష్ శోభన్ మంచి ఆప్షన్ అవుతాడు. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోకుండా, అతను లేకపోయినా కానీ తన రుణం తీర్చుకుంటోన్న ప్రభాస్ నిజంగా డార్లింగే కదూ!
This post was last modified on August 14, 2020 9:54 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…