ప్రభాస్ హీరో అయింది ‘ఈశ్వర్’తో అయినా కానీ బ్రేక్ వచ్చింది ‘వర్షం’తోనే. ఆ సినిమాతోనే ప్రభాస్ యువతరానికి హార్ట్ త్రోబ్ అయ్యాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శోభన్తో ప్రభాస్కి మంచి అనుబంధం వుంది. అయితే శోభన్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు సంతోష్ శోభన్ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు. తను నేను, పేపర్బోయ్ చిత్రాల్లో హీరోగా నటించిన సంతోష్ శోభన్కి హీరోగా బ్రేక్ రాలేదు.
దాంతో ప్రభాస్ తన హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్లో అతడితో ఒక సినిమా తీసి హీరోగా నిలబెట్టాలని తన స్నేహితులపై బాధ్యత పెట్టాడు. అందుకే అతని కోసమని యువి క్రియేషన్స్ ఒక చిన్న సినిమా తీస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే ‘ఎక్స్ప్రెస్ రాజా’ దర్శకుడి నుంచి తీసుకుని కార్తీక్ అనే యువ దర్శకుడి చేతిలో సినిమా పెట్టింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచనతో లిమిటెడ్ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇది కానీ సక్సెస్ అనిపించుకుంటే ఇక ఓటిటి సినిమాలకు, వెబ్ సిరీస్లకు సంతోష్ శోభన్ మంచి ఆప్షన్ అవుతాడు. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోకుండా, అతను లేకపోయినా కానీ తన రుణం తీర్చుకుంటోన్న ప్రభాస్ నిజంగా డార్లింగే కదూ!
This post was last modified on August 14, 2020 9:54 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…