ప్రభాస్ హీరో అయింది ‘ఈశ్వర్’తో అయినా కానీ బ్రేక్ వచ్చింది ‘వర్షం’తోనే. ఆ సినిమాతోనే ప్రభాస్ యువతరానికి హార్ట్ త్రోబ్ అయ్యాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శోభన్తో ప్రభాస్కి మంచి అనుబంధం వుంది. అయితే శోభన్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు సంతోష్ శోభన్ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు. తను నేను, పేపర్బోయ్ చిత్రాల్లో హీరోగా నటించిన సంతోష్ శోభన్కి హీరోగా బ్రేక్ రాలేదు.
దాంతో ప్రభాస్ తన హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్లో అతడితో ఒక సినిమా తీసి హీరోగా నిలబెట్టాలని తన స్నేహితులపై బాధ్యత పెట్టాడు. అందుకే అతని కోసమని యువి క్రియేషన్స్ ఒక చిన్న సినిమా తీస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే ‘ఎక్స్ప్రెస్ రాజా’ దర్శకుడి నుంచి తీసుకుని కార్తీక్ అనే యువ దర్శకుడి చేతిలో సినిమా పెట్టింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచనతో లిమిటెడ్ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇది కానీ సక్సెస్ అనిపించుకుంటే ఇక ఓటిటి సినిమాలకు, వెబ్ సిరీస్లకు సంతోష్ శోభన్ మంచి ఆప్షన్ అవుతాడు. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోకుండా, అతను లేకపోయినా కానీ తన రుణం తీర్చుకుంటోన్న ప్రభాస్ నిజంగా డార్లింగే కదూ!
This post was last modified on August 14, 2020 9:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…