ప్రభాస్ హీరో అయింది ‘ఈశ్వర్’తో అయినా కానీ బ్రేక్ వచ్చింది ‘వర్షం’తోనే. ఆ సినిమాతోనే ప్రభాస్ యువతరానికి హార్ట్ త్రోబ్ అయ్యాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శోభన్తో ప్రభాస్కి మంచి అనుబంధం వుంది. అయితే శోభన్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు సంతోష్ శోభన్ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు. తను నేను, పేపర్బోయ్ చిత్రాల్లో హీరోగా నటించిన సంతోష్ శోభన్కి హీరోగా బ్రేక్ రాలేదు.
దాంతో ప్రభాస్ తన హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్లో అతడితో ఒక సినిమా తీసి హీరోగా నిలబెట్టాలని తన స్నేహితులపై బాధ్యత పెట్టాడు. అందుకే అతని కోసమని యువి క్రియేషన్స్ ఒక చిన్న సినిమా తీస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే ‘ఎక్స్ప్రెస్ రాజా’ దర్శకుడి నుంచి తీసుకుని కార్తీక్ అనే యువ దర్శకుడి చేతిలో సినిమా పెట్టింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచనతో లిమిటెడ్ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇది కానీ సక్సెస్ అనిపించుకుంటే ఇక ఓటిటి సినిమాలకు, వెబ్ సిరీస్లకు సంతోష్ శోభన్ మంచి ఆప్షన్ అవుతాడు. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోకుండా, అతను లేకపోయినా కానీ తన రుణం తీర్చుకుంటోన్న ప్రభాస్ నిజంగా డార్లింగే కదూ!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…