తమిళనాాట రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడ ప్రస్తుతం నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తుండటం అందుకు కారణం. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కొన్నేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టడం.. రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో విజయ్ వెనక్కి తగ్గాడు.
సినిమా వాళ్లలోనే వేర్వేరు పార్టీలు ఉంటే.. పెద్ద శక్తిగా ఎదగడం కష్టం అవుతుందన్న ఉద్దేశమే విజయ్ వెనుకంజ వేయడానికి కారణమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కమల్ పెట్టిన పార్టీ ఇప్పుడు సోదిలో లేదు. రజినీకాంత్ పార్టీయే పెట్టకుండా తాను రాజకీయాలకు దూరం అనేశారు. మరో టాప్ హీరో అజిత్కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు.
మొత్తంగా సినీ పరిశ్రమ తరఫు నుంచి గ్రౌండ్ క్లియర్గా ఉంది. విజయ్కి పోటీయే లేదు. మరోవైపు జయలలిత ఉన్నంత వరకు తిరుగులేని స్థాయిలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ.. తర్వాత బలహీన పడుతూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలపడింది. ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అధికార డీఎంకే ఆధిపత్యమే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీటైన పార్టీ వస్తే దానికి స్కోప్ ఉంటుంది. ఈ అవకాశాన్ని విజయ్ ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతను పార్టీ పెడతాడనే ప్రచారం జోరుగా నడుస్తోంది.
ఈ దిశగా విజయ్ ప్రణాళికా బద్ధంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అతను అభిమానులతో సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ పెట్టడం మీదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలు పూర్తిగా మానేస్తానని విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అంతే కాక ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు త్వరలోనే తాను పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు కూడా విజయ్ వెల్లడించాడట. ఈ వార్త ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. విజయ్ పట్టుదలతో, ప్రణాళికతో రంగంలోకి దిగితే బలమైన రాజకీయ శక్తిగా ఎదగగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 12, 2023 2:24 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…