లాక్ డౌన్కి ముందు రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్లో లేదు. చిన్న సినిమాలకు కూడా ఆమెను కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫామ్లో వుండగానే సడన్గా అవకాశాలు కోల్పోయింది. నెమ్మదిగా కనిపించకుండా పోయింది. తమిళ చిత్రాలు, హిందీ సినిమాలు కొన్ని చేసినా కానీ తెలుగునాట వచ్చిన పాపులారిటీ ఆమెకి మరెక్కడా రాలేదు.
అందుకే లాక్ డౌన్ టైమ్లో మిగిలిన హీరోయిన్లు ఇప్పట్లో సెట్స్కి రాలేమంటూ నిర్మాతలకు చెప్పేస్తున్న తరుణంలో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్కి మకాం మార్చేసింది. ఆమె అనుకున్నట్టుగానే ఈ మూవ్ భలేగా వర్కవుట్ అయింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడి చిత్రంలో కథానాయికగా అవకాశం వచ్చింది. క్రిష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో సరసన సీనియర్ ఎందుకు అనుకోకుండా, రకుల్ ప్రీత్ సింగ్ వల్ల పుల్ పెరుగుతుందని ఆమెను ఫిక్స్ చేసేసారు.
అలాగే నితిన్ ‘చెక్’లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మరోసారి నాగ చైతన్యతో జత కట్టనుందని కూడా వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ తీసే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. కేవలం లోకల్గా వచ్చేసి, అందుబాటులో వుండడమే కాకుండా పారితోషికం పరంగా పట్టువిడుపులు వుండడం రకుల్కి ప్లస్ అవుతోంది.
This post was last modified on August 14, 2020 9:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…