లాక్ డౌన్కి ముందు రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్లో లేదు. చిన్న సినిమాలకు కూడా ఆమెను కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫామ్లో వుండగానే సడన్గా అవకాశాలు కోల్పోయింది. నెమ్మదిగా కనిపించకుండా పోయింది. తమిళ చిత్రాలు, హిందీ సినిమాలు కొన్ని చేసినా కానీ తెలుగునాట వచ్చిన పాపులారిటీ ఆమెకి మరెక్కడా రాలేదు.
అందుకే లాక్ డౌన్ టైమ్లో మిగిలిన హీరోయిన్లు ఇప్పట్లో సెట్స్కి రాలేమంటూ నిర్మాతలకు చెప్పేస్తున్న తరుణంలో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్కి మకాం మార్చేసింది. ఆమె అనుకున్నట్టుగానే ఈ మూవ్ భలేగా వర్కవుట్ అయింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడి చిత్రంలో కథానాయికగా అవకాశం వచ్చింది. క్రిష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో సరసన సీనియర్ ఎందుకు అనుకోకుండా, రకుల్ ప్రీత్ సింగ్ వల్ల పుల్ పెరుగుతుందని ఆమెను ఫిక్స్ చేసేసారు.
అలాగే నితిన్ ‘చెక్’లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మరోసారి నాగ చైతన్యతో జత కట్టనుందని కూడా వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ తీసే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. కేవలం లోకల్గా వచ్చేసి, అందుబాటులో వుండడమే కాకుండా పారితోషికం పరంగా పట్టువిడుపులు వుండడం రకుల్కి ప్లస్ అవుతోంది.
This post was last modified on August 14, 2020 9:50 pm
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…