లాక్ డౌన్కి ముందు రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్లో లేదు. చిన్న సినిమాలకు కూడా ఆమెను కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫామ్లో వుండగానే సడన్గా అవకాశాలు కోల్పోయింది. నెమ్మదిగా కనిపించకుండా పోయింది. తమిళ చిత్రాలు, హిందీ సినిమాలు కొన్ని చేసినా కానీ తెలుగునాట వచ్చిన పాపులారిటీ ఆమెకి మరెక్కడా రాలేదు.
అందుకే లాక్ డౌన్ టైమ్లో మిగిలిన హీరోయిన్లు ఇప్పట్లో సెట్స్కి రాలేమంటూ నిర్మాతలకు చెప్పేస్తున్న తరుణంలో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్కి మకాం మార్చేసింది. ఆమె అనుకున్నట్టుగానే ఈ మూవ్ భలేగా వర్కవుట్ అయింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడి చిత్రంలో కథానాయికగా అవకాశం వచ్చింది. క్రిష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో సరసన సీనియర్ ఎందుకు అనుకోకుండా, రకుల్ ప్రీత్ సింగ్ వల్ల పుల్ పెరుగుతుందని ఆమెను ఫిక్స్ చేసేసారు.
అలాగే నితిన్ ‘చెక్’లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మరోసారి నాగ చైతన్యతో జత కట్టనుందని కూడా వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ తీసే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. కేవలం లోకల్గా వచ్చేసి, అందుబాటులో వుండడమే కాకుండా పారితోషికం పరంగా పట్టువిడుపులు వుండడం రకుల్కి ప్లస్ అవుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…