రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచే కొద్దీ సినిమాల్లో తెలంగాణ సెంటిమెంటు, ట్రెండుని ఫాలో కావడం మాత్రం గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. నైజామ్ వేషభాషలతో ప్రత్యేకంగా పాత్రలు, పాటలు డిజైన్ చేయిస్తున్నారు. దసరా, బలగం లాంటివి ఎన్నింటికో స్ఫూర్తినిచ్చాయి . పరేషాన్, మేం ఫేమస్, ఇంటింటి రామాయణం ఇదే దారిలో నడిచివవే. ఇంకా జనం దృష్టిలో పడకుండా థియేటర్లకు వచ్చి వెళ్ళినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ కూడా పబ్లిక్ పల్స్ ని అనుసరించి ఆగస్ట్ 11 విడుదల కాబోయే భోళా శంకర్ లో ట్రెండుకి ఓటేశారు
ఇవాళ జామ్ జామ్ జజ్జనక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. దాదాపు క్యాస్టింగ్ మొత్తం ఈ పాటలో ఉంది. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లతో పాటు చిన్నా చితక పెద్ద ఆర్టిస్టులందరూ ఇందులో భాగమయ్యారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సెలెబ్రేషన్ సాంగ్ మెల్లగా మాస్ కు ఎక్కేలా మంచి బీట్స్ తో సాగింది. అసలు విశేషం అది కాదు. మధ్యలో నర్సాపెల్లే గండిలోన గంగధారి అంటూ యూట్యూబ్ సెన్సేషన్ కనకవ్వతో పాటు సింగర్ మంగ్లీ పాడిన అచ్చ తెలంగాణ బ్లాక్ బస్టర్ పాటని ఇక్కడ వాడేశారు. వీళ్లిద్దరి ఒరిజినల్ వెర్షన్ ఇప్పటిదాకా 316 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది.
అంతగా జనానికి ఎక్కేసిన కనకవ్వ మంగ్లీలను భోళా శంకర్ లో మంచి టైమింగ్ తో వాడేశాడు దర్శకుడు మెహర్ రమేష్. థియేటర్ లో దీనికి ప్రత్యేకంగా రెస్పాన్స్ ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.చిరంజీవి పాత్ర కూడా అదే స్లాంగ్ లో ఉంటుందని టీజర్ లో ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగానే కంపోజ్ చేయించారు. టైటిల్ ట్రాక్ కన్నా ఇదే కాస్త బెటర్ గా అనిపిస్తోంది. వినడానికి రెగ్యులర్ గా ఉన్నా విజువల్ గా కలర్ఫుల్ గా ఉంది. ఆల్బమ్ లో ఇంకో మూడు పాటలు ఉన్నాయి. సరిగ్గా నెలలో రాబోతున్న భోళా శంకర్ ఫలితం గురించి టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…