టాలీవుడ్లో చాలా వేగంగా సినిమాలు చేసే స్టార్ హీరోల్లో నాని ఒకడు. ఈ ఏడాది వేసవిలో మాస్ మూవీ ‘దసరా’తో మంచి ఫలితాన్నందుకున్న నాని.. ఏడాది చివర్లో దీనికి పూర్తి భిన్నమైన ఒక క్లాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది.
చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘హలో డాడీ’ అనే పేరును ఈ సినిమాకు ఖరారు చేసే అవకాశాలున్నాయట. ‘హాయ్ డాడీ’, ‘డియర్ డాడీ’ లాంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ‘హలో డాడీ’నే క్యాచీగా ఉంటుందని.. అదే ఫైనలైజ్ కావచ్చని అంటున్నారు. ఈ సినిమా తండ్రి-కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో సాగనుంది. ఒక ఎమోషనల్ జర్నీలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
నాని కూతురి పాత్రలో కియారా ఖన్నా అనే చిన్నారి నటిస్తోంది. ఈ సినిమా ప్రి టీజర్ చూస్తేనే ఇది తండ్రీ కూతుళ్ల కథ అని అర్థమైపోయింది. కథా కథనాలు హృధ్యంగా.. గుండెల్ని హత్తుకునేలా ఉంటాయని.. ఈ చిత్రంతో నాని ప్రేక్షకులను ఏడిపించేయడం ఖాయమని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘డాడీ’ తరహాలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. కథానాయిక కంటే కూతురి పాత్రే సినిమాలో కీలకమట.
అందుకే సినిమాకు ‘హలో డాడీ’ టైటిల్ పెట్టాలని చూస్త్తున్నారు. ఇంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్లో భాగస్వామిగా ఉన్న మోహన్ చెరుకూరి ఇప్పుడు కొత్తగా ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ అనే బేనర్ పెట్టి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విజేందర్ రెడ్డి, మూర్తి కూడా ఇందులో భాగస్వాములు. ‘ఖుషి’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారట.
This post was last modified on July 11, 2023 5:28 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…