మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ పై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా నుండి తమన్ అవుట్ అనే వార్త కూడా ఈ మధ్య గట్టిగా వినిపించింది. అయితే దాని గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా సెటైర్ వేస్తూ ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు తమన్. తాజాగా బ్రో సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా గుంటూరు కారం గురించి మాట్లాడాడు.
సినిమా నుండి నన్ను తీసేస్తే ప్రొడ్యూసర్ చెప్తారు కదా, అంతా బాగానే ఉంది. కానీ ఏవేవో రాస్తున్నారు. అందరూ ఆ సినిమా మీదే పడ్డారెందుకో అర్థం కావట్లేదు అంటూ తమన్ రియాక్ట్ అయ్యాడు. ఇక క్రికెట్ మీద ఫోకస్ తో సాంగ్స్ టైమ్ కి ఇవ్వడం లేదనే ప్రశ్న కూడా తమన్ కి ఎదురైంది. అలాంటిదేం లేదని తమన్ చెప్పుకున్నాడు. తనకి గర్ల్ ఫ్రెండ్స్ లేరు , ఎలాంటి ఇతర వ్యాసనాలు లేవని , కేవలం క్రికెట్ ఒక్కటే తనకి ఎమోషన్ అంటూ తెలిపాడు.
అది కూడా రాత్రి వేళ రిలాక్స్ కోసం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆడుతానని అన్నాడు. పని పక్కన పెట్టేసి క్రికెట్ ఆడటం లేదని చెప్పాడు. తాజాగా రిలీజయిన బ్రో లో మై డియర్ మార్కండేయ సాంగ్ రెస్పాన్స్ గురించి చెప్తూ తనకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పాడు. సినిమాలో మరో మూడు సాంగ్స్ ఉంటాయని , అలాగే ప్రమోషనల్ సాంగ్ ఉంటుందని , వారానికి ఒక సాంగ్ చొప్పున రిలీజ్ చేస్తామని తమకి టైమ్ లేదని తెలిపాడు.
This post was last modified on July 10, 2023 6:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…