మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ పై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా నుండి తమన్ అవుట్ అనే వార్త కూడా ఈ మధ్య గట్టిగా వినిపించింది. అయితే దాని గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా సెటైర్ వేస్తూ ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు తమన్. తాజాగా బ్రో సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా గుంటూరు కారం గురించి మాట్లాడాడు.
సినిమా నుండి నన్ను తీసేస్తే ప్రొడ్యూసర్ చెప్తారు కదా, అంతా బాగానే ఉంది. కానీ ఏవేవో రాస్తున్నారు. అందరూ ఆ సినిమా మీదే పడ్డారెందుకో అర్థం కావట్లేదు అంటూ తమన్ రియాక్ట్ అయ్యాడు. ఇక క్రికెట్ మీద ఫోకస్ తో సాంగ్స్ టైమ్ కి ఇవ్వడం లేదనే ప్రశ్న కూడా తమన్ కి ఎదురైంది. అలాంటిదేం లేదని తమన్ చెప్పుకున్నాడు. తనకి గర్ల్ ఫ్రెండ్స్ లేరు , ఎలాంటి ఇతర వ్యాసనాలు లేవని , కేవలం క్రికెట్ ఒక్కటే తనకి ఎమోషన్ అంటూ తెలిపాడు.
అది కూడా రాత్రి వేళ రిలాక్స్ కోసం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆడుతానని అన్నాడు. పని పక్కన పెట్టేసి క్రికెట్ ఆడటం లేదని చెప్పాడు. తాజాగా రిలీజయిన బ్రో లో మై డియర్ మార్కండేయ సాంగ్ రెస్పాన్స్ గురించి చెప్తూ తనకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పాడు. సినిమాలో మరో మూడు సాంగ్స్ ఉంటాయని , అలాగే ప్రమోషనల్ సాంగ్ ఉంటుందని , వారానికి ఒక సాంగ్ చొప్పున రిలీజ్ చేస్తామని తమకి టైమ్ లేదని తెలిపాడు.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…