తెలుగు హీరోయిన్లకు తెలుగులో ప్రాధాన్యం తక్కువ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల నుంచి ఈ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా 2000 తర్వాత పర భాషా కథానాయికలదే ఇక్కడ ఆధిపత్యం. దక్షిణాదిన కూడా మలయాళం, తమిళం, కన్నడ నుంచి ఇక్కడికి హీరోయిన్లను తెచ్చుకుని పెద్ద సినిమాల్లో ఛాన్సులు ఇస్తారు కానీ.. తెలుగు అమ్మాయిలకు మాత్రం ప్రయారిటీ ఉండదు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. అంజలి, స్వాతి, ఆనంది, శ్రీ దివ్య లాంటి హీరోయిన్లు తమిళంలో వెళ్లి మంచి పేరు సంపాదించారు. బోలెడన్ని అవకాశాలు అందుకున్నారు కానీ.. వాళ్లెవ్వరికీ తెలుగులో అంత మంచి ఛాన్సులు రాలేదు. ఇప్పుడు మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆమె తెలుగులో కథానాయికగా చాలా వరకు చిన్న సినిమాలే చేసింది. ఆమెకు ఇప్పుడు తమిళం, మలయాళంలో అవకాశాలు వస్తున్నాయి.
తెలుగులో తెలుగు అమ్మాయిలకు ప్రయారిటీ లేకపోవడంపై ఈషా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. వేరే భాషలకు వెళ్తే తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడతారని.. కానీ మన దగ్గర మన హీరోయిన్లకు తగిన గుర్తింపు ఉండదని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘ప్రస్తుతం నేను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తున్నా. వేరే ఇండస్ట్రీల వాళ్లు తెలుగు సినిమా స్టామినా గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు వాళ్లందరూ టాలీవుడ్ గురించే మాట్లాడుకోవడం చూసి గర్వంగా అనిపించేది.
కానీ మన దగ్గర తెలుగు భాష వచ్చిన వాళ్ల కంటే తెలుగు తెలియని వాళ్లకే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల వాళ్లని హీరోయిన్లుగా పెటుకోమని ప్రేక్షకులేమీ అడగరు. అలాంటప్పుడు వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఎందుకివ్వాలి? హీరోయిన్లు అనే కాదు.. అన్ని పాత్రల గురించీ నేనీ ప్రశ్న అడుగుతున్నా. తెలుగు వారిలో ఎంతోమంది ప్రతిభావంతులున్నారు. వారికి ఎలాంటి అవకాశాలు దక్కడం లేదు. తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చినా హీరోయిన్లుగా కాదు’’ అని ఈషా రెబ్బా పేర్కొంది.
This post was last modified on July 9, 2023 7:29 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…