ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ‘ప్రాజెక్ట్-కే’ ఒకటి. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం అయితే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ కావచ్చు. ఇటీవలే ఈ ప్రాజెక్టులోకి లోక నాయకుడు కమల్ హాసన్ రావడంతో దీని స్కేల్ ఇంకా పెరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అప్పటికి చిత్రం రెడీ కాకపోవచ్చు.
వచ్చే ఏడాది వేసవిలో, లేదంటే ద్వితీయార్ధంలో రిలీజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐతే రిలీజ్ గురించి చర్చ ఎలా ఉన్నప్పటికీ ‘ప్రాజెక్ట్-కే’ అయితే తరచుగా వార్తల్లో ఉంటోంది. కమల్ హాసన్ సినిమాలో భాగమవ్వడం.. ఆ తర్వాత ‘కామిక్ కాన్’ నుంచి ఆహ్వానం అందుకోవడం.. అలాగే సినిమాకు సంబంధించి మెర్చండైజ్ అమ్మకాలతో సోషల్ మీడియాలో ‘ప్రాజెక్ట్-కే’ ట్రెండ్ అవుతూనే ఉంది.
మరోవైపు ‘ప్రాజెక్ట్-కే’ టైటిల్ విషయంలోనూ ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకీ ఇందులో ‘కే’ అంటే ఏంటనే విషయంలో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇందులో హీరో ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తాడు కాబట్టే టైటిల్లో ‘కే’ అని పెట్టారనే చర్చ నడిచింది ఇంతకుముందు. కానీ తాజా సమాచారం ప్రకారం ‘కే’కు ఇండికేషన్ అది కాదట. ‘కే’ అంటే ‘కాల చక్ర’ అని సమాచారం.
ఈ సినిమా టైం ట్రావెల్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాన్ని సూచించేలాగే ‘కాలచక్ర’ను షార్ట్ చేసి టైటిల్లో ‘కే’ అని పెట్టారని అంటున్నారు. ఇందులో హీరో చేపట్టే మిషన్ పేరు కూడా ‘ప్రాజెక్ట్ కాలచక్ర’ అని.. దాన్నే షార్ట్ చేసి ‘ప్రాజెక్ట్-కే’గా టైటిల్ ఖాయం చేశారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతోంది.
This post was last modified on July 9, 2023 6:30 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…