‘ఆదిపురుష్’తో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు.. త్వరగానే కోలుకున్నారు. అందుక్కారణం.. ‘సలార్’ సందడి మొదలైపోవడమే. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కావడం.. ఇది ప్రభాస్ ఇమేజ్కు, కటౌట్కు తగ్గ పక్కా మాస్ బొమ్మ కావడంతో వారిలో ఉత్సాహం నింపుతోంది. ఈసారి ప్రభాస్ బ్లాక్ బస్టర్ మిస్సయ్యే ఛాన్సే లేదని అభిమానులు ధీమాగా ఉన్నారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. పక్కాగా ఆ డేట్కు సినిమా రాబోతోందని ఇటీవల టీజర్తో స్పష్టం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల విషయంలో చిత్ర బృందం పక్కా ప్లానింగ్తోనే అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఐతే సెప్టెంబరు 28 ‘సలార్’ రిలీజ్కు సరైన డేటేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబరు 19న వినాయక చవితి రాబోతోంది. దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో నిమజ్జనం జరిగే రోజే ‘సలార్’ రిలీజ్ కాబోతోంది. ఇది సినిమా వసూళ్ల మీద కొంత ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. జనమంతా రోడ్ల మీద ఉండే ఆ రోజుల్లో ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. మామూలు సినిమాలైతే పర్వాలేదు కానీ.. ‘సలార్’ లాంటి భారీ అంచనాలున్న సినిమా అదే రోజు రిలీజైతే మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెం కూడా రావచ్చు.
ఎన్నో ఆంక్షల మధ్య ఆ రోజు షోలు వేయడం.. జనాలను థియేటర్లకు రప్పించడం కూడా కష్టమవుతుంది. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో హైదరాబాద్లో ఫేమస్ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్ను పూర్తిగా మూసేస్తారు కూడా. ‘సలార్’ లాంటి సినిమా రిలీజైనపుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ల్లో షోలు పడకపోవడం అన్నది హైదరాబాదీ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ముందు లేదా వెనకటి వారానికి సినిమాను వాయిదా వేయాలనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…