తనకే కాదు నిర్మాత కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నాగ శౌర్య చాలా ధీమాగా చెప్పిన రంగబలి ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో రాలేదన్న మాట వసూళ్ల రూపంలో కళ్ళముందు కనిపిస్తోంది. టాక్ అటుఇటుగా ఉండటం, రివ్యూలు అంతంత మాత్రంగా రావడంతో ఫైనల్ స్టేటస్ ఏమంత ఆశాజనకంగా ఉండబోవడం లేదన్నది ట్రేడ్ మాట. సరే ఫైనల్ స్టేటస్ కి ఇంకా టైం ఉంది కానీ భలే బ్లాక్ బస్టర్ పేరుతో టీమ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగశౌర్య ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా బయట పడిపోయింది. సెకండ్ హాఫ్ విషయంలో వచ్చిన విమర్శలను అంగీకరించడానికి ఇష్టపడలేదు.
కొన్ని లాజిక్స్, డీటెయిల్స్ మిస్ అవ్వడం గురించి స్పందిస్తూ అన్ని చూపిస్తూ పోతే రంగబలిని పదహారు గంటలు తీయాల్సి వస్తుందని ఇక బాహుబలి ఇంకెన్ని సంవత్సరాలు తీయాలో అంటూ అసహనం వ్యక్తం చేసి అక్కడితో ముంగించేసి వెళ్లిపోవడం కెమెరా సాక్షిగా రికార్డైపోయింది. ఇదొక్కటే కాదు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో దర్శకుడు పవన్ బసంశెట్టి సైతం బెస్ట్ ఎంటర్ టైనర్ తీశామని చెప్పడానికి నానా పాట్లు పడ్డ వైనం స్పష్టంగా కనిపించింది. ఇలా మీడియాని పిలిచి ప్రత్యక్ష ప్రసారంలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పెట్టినప్పుడు అన్నింటికి ప్రిపేరయ్యే ఉండాలి.
రంగబలికి ఈ వీకెండ్ చాలా కీలకం కానుంది. శని ఆదివారాలు వీలైనంత రాబట్టుకుంటే బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు దగ్గరవుతారు. కానీ ఆ స్థాయి కలెక్షన్లు లేవు కాబట్టి ప్రమోషన్ ని ఇంకేదయినా క్రియేటివ్ గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారం మంచి బజ్ తో బేబీ రిలీజ్ ఉంది. దాంతో పాటు మహావీరుడు, నాయకుడు వస్తున్నాయి. ఇవి కాకుండా మిషన్ ఇంపాజిబుల్ ఉండనే ఉంది. సో రంగబలి వాటి మధ్య నెగ్గుకురావాలంటే ఈపాటికి సామజవరగమన టాక్ వచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఛలో రేంజ్ అని శౌర్య పదే పదే చెబుతున్నాడు కానీ చివరికి ఎక్కడ నిలుస్తుందో చూడాలి
This post was last modified on July 8, 2023 3:54 pm
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు.…
రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని…
టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండవల్లిలోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత.. ఆయన మీడియాతో మాట్లాడుతూ..…
స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…
ఏపీలో జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు జిల్లాలు మినహా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ ఆశాజనకంగానే సాగుతోంది.…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. గతానికి భిన్నంగా ఆయన ఈ సారి భార్యతో…