మెగా అభిమానులకు 2023 ఆరంభంలోనే మంచి కిక్కు దొరికింది. సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ అయి కొత్త సంవత్సరంలో మెగా ఫ్యామిలీకి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక వేసవిలో వచ్చిన సాయిధరమ్ తేజ్ సినిమా ‘విరూపాక్ష’ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో అభిమానుల ఆనందం రెట్టింపయింది.
ఇప్పుడు మెగా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయడానికి బాక్సాఫీస్ రెడీ అవుతోంది. నెల రోజుల వ్యవధిలో మెగా హీరోల సినిమాలు నాలుగు రిలీజ్ కాబోతుండటం విశేషం. ఇంతకు ముందెన్నడూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఇంత తక్కువ వ్యవధిలో ఇలాంటి ‘మెగా’ రష్ చూసి ఉండరు అభిమానులు. ఈ నెల 28న పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ల ‘బ్రో’ మూవీతో సందడి మొదలు కాబోతోంది.
మామా అల్లుళ్లయిన పవన్, తేజు కలిసి సినిమా చేయడమే మెగా అభిమానులకు పెద్ద విశేషం. ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ.. కావల్సినంత బజ్ వచ్చింది. ప్రోమోలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్, తేజులకు మరో హిట్ కచ్చితంగా రాబోతోందని ట్రేడ్ వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇక రెండు వారాలకే మెగాస్టార్ చిరంజీవి వేంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటించిన ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు హైప్ కొంచెం తక్కువే కానీ.. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు నుంచి వస్తున్న సినిమా, పైగా ఇండిపెండెన్స్ వీకెండ్లో రిలీజ్ కాబట్టి ఓ మోస్తరుగా సందడి చేసినా.. సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంటుందనే ధీమాతో అభిమానులు ఉన్నారు. ఇక చిరు సినిమా వచ్చిన వారం రోజులకే ఆయన చిన్న మేనల్లుడు, తేజు తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఆదికేశవ’ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆగస్టు 18 రిలీజ్ డేట్గా ఖరారైంది. ఇక నెలాఖర్లో వరుణ్ తేజ్ సినిమా ‘గాండీవధారి అర్జున’ రాబోతోంది. ఇలా నాలుగు వారాల వ్యవధిలో మెగా హీరోల సినిమాలు నాలుగు రిలీజ్ కావడం అరుదైన విషయమే.
This post was last modified on July 8, 2023 2:55 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…