యువ కథానాయకుడు నిఖిల్ కొత్త సినిమా ‘స్పై’ విడుదలకు కొన్ని రోజుల ముందు నిర్మాతకు, హీరోకు విభేదాలు నెలకొన్నట్లుగా కొన్ని వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథాంశం దృష్ట్యా.. సినిమాను పకడ్బందీగా తీర్చిదిద్ది, సరిగ్గా ప్రమోట్ చేస్తే ‘కార్తికేయ-2’ లాగే జాతీయ స్థాయిలో సత్తా చాటగలదని నిఖిల్ నమ్మాడు. అందుకోసం ఇంకా సమయం కావాలని.. రిలీజ్ వాయిదా వేయాలని అతను భావిస్తే.. నిర్మాత మాత్రం ముందు అనుకున్నట్లే జూన్ 29న రిలీజ్కు రెడీ అయిపోయాడు.
కొన్ని రోజుల స్తబ్ధత తర్వాత నిఖిల్ తగ్గి వచ్చాడు. నిర్మాత ఇష్టప్రకారమే జూన్ 29న సినిమా రిలీజైంది. ఐతే ముందున్న బజ్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ కంటెంట్ వీక్ కావడంతో తర్వాత సినిమా నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే అంతగా ఆడని ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మినిమం సౌండ్ చేయలేకపోయింది.
‘కార్తికేయ-2’తో అనుకోకుండా కలిసి వచ్చిన పాన్ ఇండియా మార్కెట్ను నిఖిల్ ఉపయోగించుకోలేకపోయాడనే అభిప్రాయాలు కలిగాయి. ఈ నేపథ్యంలోనే నిఖిల్ తన పాన్ ఇండియా ఫ్యాన్స్ను క్షమాపణ కోరుతూ ఒక నోట్ రిలీజ్ చేశాడు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 50 రోజుల లోపు ఓటీటీకి ఇస్తే పీవీఆర్ సహా కొన్ని నేషనల్ మల్టీప్లెక్స్ ఛైన్స్ ఆ సినిమాలను తమ స్క్రీన్లలో ప్రదర్శించట్లేదు. ‘స్పై’ నెల రోజులకే ఓటీటీలో వచ్చేలా ఒప్పందం జరగడంతో ఈ సినిమా మల్టీప్లెక్సుల్లో షోలు మిస్సయింది.
దీనికి తోడు కంటెంట్ సరైన సమయానికి డెలివరీ కాకపోవడంతో ఓవర్సీస్లో చాలా షోలు రద్దయ్యాయి. ఇవి సినిమా వసూళ్లపై బాగానే ప్రభావం చూపాయి. సిినిమాకు వచ్చిన ఓవరాల్ వసూళ్లు చూస్తే.. నిఖిల్ ‘కార్తికేయ-2’ వల్ల కొత్తగా ఏం మార్కెట్ సంపాదించాడనే ప్రశ్నలు తలెత్తాయి. ఐతే సినిమా ఆడకపోవడానికి అసలు కారణం కంటెంట్ వీక్ కావడం కాగా.. వేరే కారణాలు కూడా తోడై వసూళ్లు మరీ తక్కువ రావడంతో అది తర్వాతి సినిమాలకు ఇబ్బందిగా మారుతుందని భావించి నిఖిల్ నోట్ రిలీజ్ చేశాడు. నిజానికి ‘స్పై’ కంటే తన తర్వాతి సినిమాలు స్వయంభు, కార్తికేయ-2ల మీద నిఖిల్ పాన్ ఇండియా ఆశలు ఎక్కువగా పెట్టుకున్నాడు. అందుకే అవెక్కడ దెబ్బ తింటాయో అని ఇలా నోట్ రిలీజ్ చేశాడు.
This post was last modified on July 5, 2023 7:54 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…