ఎంతో నమ్మకంతో విపరీతమైన ప్రమోషన్లు చేసిన స్పై నిఖిల్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కావాల్సినంత యాక్షన్ ఉన్నప్పటికీ కథనంలో లోపాల వల్ల ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. దానికి తోడు హడావిడిగా 29నే రిలీజ్ చేయాలని నిర్మాత గట్టిగా పట్టుబట్టడంతో అది కూడా కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అయితే ముందుగా చెప్పినట్టు స్పై మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ జరగలేదు. అంతే కాదు కంటెంట్ సరైన సమయానికి చేరకపోవడం వల్ల ఓవర్సీస్ ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయి. వీటన్నిటికి కలిపి నిఖిల్ ట్విట్టర్ వేదికగా ఒక లెటర్ ద్వారా సారీ చెప్పాడు.
దాని సారాంశం ఇలా ఉంది. నా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చేలా చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ అన్ని భాషల్లో విడుదల చేయడంలో మా బృందం విఫలమైనందుకు బాధగా ఉంది. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు, కంటెంట్ డిలే వల్ల షోలు రద్దయ్యాయి. ఓవర్సీస్ లోనూ 350 ప్రీమియర్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ ప్రేక్షకులను ఈ విషయంగా క్షమాపణ కోరుతున్నాను. నా రాబోయే మూడు సినిమాలు టైం ప్రకారం అన్నీ పక్కాగా సిద్ధం చేసుకుని అన్ని భాషల్లో రిలీజవుతాయి.
ప్రతి తెలుగు సినిమా అభిమానికి ఇకపై నాణ్యత విషయంలో ఎంత ఒత్తిడి వచ్చినా రాజీ పడనని తెలియజేస్తున్నాను. ప్రతిదీ చెక్ చేసుకుని, పూర్తి సంసిద్ధంగా సినిమా తయారైనప్పుడే మీ ముందుకు వస్తాను. మొత్తానికి నిఖిల్ చాలా హుందాగా స్పై పరిణామాల పట్ల సారీ చెప్పడం అభిమానులనే కాదు నెటిజెన్లను సైతం ఆకట్టుకుంటోంది. కార్తికేయ 2తో వచ్చిన ప్యాన్ ఇండియా సక్సెస్ ని నిలబెట్టుకునే క్రమంలో స్పై లాంటి స్పీడ్ బ్రేకర్లు ఎంతైనా ఇబ్బంది పెట్టేవే. హిట్టు ఫ్లాపు ఎవరికైనా సహజమే కానీ ఇలా రిలీజ్ రోజు షోలు పడకపోవడం ఒకరకంగా మరక లాంటిది. అందుకే నిఖిల్ ఓపెన్ అయిపోయాడు
This post was last modified on July 5, 2023 10:27 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…