మంచు మోహన్ బాబు నట వారసుల్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది మంచు మనోజే. నేను మీకు తెలుసా, బిందాస్, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంటు తీగ లాంటి సినిమాలతో అతను ఒకప్పుడు యూత్లో మంచి క్రేజే సంపాదించాడు. కానీ తర్వాత వరుస ఫెయిల్యూర్లు, తనకు నప్పని సినిమాల వల్ల అతను వెనుకబడిపోయాడు. కెరీర్లో బాగా గ్యాప్ కూడా వచ్చేసింది.
ఇప్పుడు మళ్లీ తన స్టయిల్లో వాట్ ద ఫిష్ అనే క్రేజీ మూవీ ఒకటి చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా.. మనోజ్ గురించి ఇప్పుడో ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. అతను కెరీర్లో తొలిసారిగా విలన్ పాత్ర చేయబోతున్నాడన్నదే ఆ వార్త. అది కూడా రవితేజ సినిమాలో కావడం విశేషం. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్.. మాస్ రాజాతో తీయబోయే చిత్రంలో మనోజ్ను విలన్గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ చిత్రంలో విశ్వక్సేన్ కూడా ఒక హీరోగా నటిస్తాడట. చాలా క్రేజీగా కనిపిస్తున్న కాంబినేషన్ ఇది. ముఖ్యంగా మనోజ్ విలన్ అనగానే అందరిలోనూ క్యూరియాసిటీ వస్తోంది. మనోజ్ చేసిన కొన్ని క్యారెక్టర్లు.. వాటిలో తన అగ్రెషన్ చూస్తే విలన్ పాత్రలకు బాగా సూటవుతాడని అనిపిస్తుంది. పైగా మనోజ్ తండ్రి మోహన్ బాబు విలన్గా ఎంత గొప్ప పాత్రలు చేశాడో.. ఎంత పేరు సంపాదించాడో తెలిసిందే. మోహన్ బాబుకు దగ్గరగా ఉండే వాచికంతో మనోజ్ కూడా విలనీని బాగా పండించగలడనే అభిప్రాయాలున్నాయి.
సరైన క్యారెక్టర్ పడి.. అతను బాగా పెర్ఫామ్ చేస్తే మోత మోగిపోవడం ఖాయం. విలన్ పాత్ర చేయడానికి మనోజ్ ఒప్పుకున్నట్లయితే అతను మంచి నిర్ణయిం తీసుకున్నట్లే. హీరోగా చేస్తూనే అప్పుడప్పుడూ ప్రతినాయక పాత్రలు చేస్తే తన రేంజే మారిపోవడం, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం ఖాయం.
This post was last modified on July 5, 2023 1:08 am
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…