గత ఏడాది కళ్యాణ్ రామ్ కు అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన బింబిసారకు కొనసాగింపు ఉంటుందని యూనిట్ ప్రమోషన్ టైంలో చెబుతూనే వచ్చింది. కొనసాగింపుకి మంచి స్కోప్ ఉండటంతో కార్తికేయ లాగా దీన్నో సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లాగా మార్చాలనుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు వశిష్ట ఒక లైన్ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడు. కానీ ఈలోగా చిరంజీవికి ఒక ఫాంటసీ కథ వినిపించడం, దానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే అగ్రిమెంట్ ప్రకారం సీక్వెల్ కాకుండా వశిష్ట వేరే హీరోతో ప్రాజెక్టు చేయడానికి ఛాన్స్ లేదట.
ఒకవేళ ఇంకో స్టార్ తో వేరే కథను చేయాలన్నా వచ్చే పారితోషికంలో నలభై శాతం దాకా వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వద్దు అనుకుంటే బింబిసార 2 ని పూర్తి చేయాలి. ఎలాగూ ఇతను సుముఖంగా ఉన్నాడని తెలిసే కళ్యాణ్ రామ్ వెంటనే రొమాంటిక్ ఫేమ్ అనిల్ పాడూరిని లైన్ లోకి తెచ్చాడు. ఫ్రెష్ స్క్రిప్ట్ వండుతారా లేక గతంలో అనుకున్న దానికే మార్పులు చేర్పులు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ అలా చేయాలన్నా వశిష్ట అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అతను ఓకే చెప్పాలంటే కండీషన్ తీసేయమంటాడు. సో ఇది రెండు వైపులా చిక్కుకున్న సమస్య లాంటిది.
చివరికి పరిష్కారం ఏమవుతుందో కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది. చిరంజీవి సినిమా మొదలు పెట్టాలంటే ఇది క్లియర్ చేసుకోవాల్సిందే. ఎలాగూ కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ చేస్తున్న మూవీ షూటింగ్ కి అయిదారు నెలలు పడుతుంది కాబట్టి ఆలోగానే సెటిల్ చేసుకుంటే రూట్ క్లియరవుతుంది. వశిష్ట మాత్రం రెగ్యులర్ గా చిరు కాంపౌండ్ తో టచ్ లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. బింబిసార లాంటి గ్రాండియర్ కి కథను నమ్మి అంత బడ్జెట్ చేతిలో పెట్టిన కళ్యాణ్ రామ్ కి ఇలా చేయడం పట్ల ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు. ఇదంతా ప్రచారంలో ఉన్న కథే కానీ ఎవరో ఒకరు బయటికి వచ్చి అఫీషియల్ క్లారిటీ ఇస్తే తప్ప మబ్బులు వీడవు
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…