గత ఏడాది కళ్యాణ్ రామ్ కు అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన బింబిసారకు కొనసాగింపు ఉంటుందని యూనిట్ ప్రమోషన్ టైంలో చెబుతూనే వచ్చింది. కొనసాగింపుకి మంచి స్కోప్ ఉండటంతో కార్తికేయ లాగా దీన్నో సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లాగా మార్చాలనుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు వశిష్ట ఒక లైన్ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడు. కానీ ఈలోగా చిరంజీవికి ఒక ఫాంటసీ కథ వినిపించడం, దానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే అగ్రిమెంట్ ప్రకారం సీక్వెల్ కాకుండా వశిష్ట వేరే హీరోతో ప్రాజెక్టు చేయడానికి ఛాన్స్ లేదట.
ఒకవేళ ఇంకో స్టార్ తో వేరే కథను చేయాలన్నా వచ్చే పారితోషికంలో నలభై శాతం దాకా వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వద్దు అనుకుంటే బింబిసార 2 ని పూర్తి చేయాలి. ఎలాగూ ఇతను సుముఖంగా ఉన్నాడని తెలిసే కళ్యాణ్ రామ్ వెంటనే రొమాంటిక్ ఫేమ్ అనిల్ పాడూరిని లైన్ లోకి తెచ్చాడు. ఫ్రెష్ స్క్రిప్ట్ వండుతారా లేక గతంలో అనుకున్న దానికే మార్పులు చేర్పులు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ అలా చేయాలన్నా వశిష్ట అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అతను ఓకే చెప్పాలంటే కండీషన్ తీసేయమంటాడు. సో ఇది రెండు వైపులా చిక్కుకున్న సమస్య లాంటిది.
చివరికి పరిష్కారం ఏమవుతుందో కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది. చిరంజీవి సినిమా మొదలు పెట్టాలంటే ఇది క్లియర్ చేసుకోవాల్సిందే. ఎలాగూ కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ చేస్తున్న మూవీ షూటింగ్ కి అయిదారు నెలలు పడుతుంది కాబట్టి ఆలోగానే సెటిల్ చేసుకుంటే రూట్ క్లియరవుతుంది. వశిష్ట మాత్రం రెగ్యులర్ గా చిరు కాంపౌండ్ తో టచ్ లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. బింబిసార లాంటి గ్రాండియర్ కి కథను నమ్మి అంత బడ్జెట్ చేతిలో పెట్టిన కళ్యాణ్ రామ్ కి ఇలా చేయడం పట్ల ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు. ఇదంతా ప్రచారంలో ఉన్న కథే కానీ ఎవరో ఒకరు బయటికి వచ్చి అఫీషియల్ క్లారిటీ ఇస్తే తప్ప మబ్బులు వీడవు
This post was last modified on July 4, 2023 3:41 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…