Movie News

ప్రభాస్ మిత్రులకు ఈ ముద్ర మంచిదేనా?

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమైంది. 2019కు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ, ఆయన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ను ఎన్నికల అస్త్రంగా వాడుకున్న వైసీపీ.. ఈసారి జగన్ సినిమాను తెరపైకి తీసుకురాబోతోంది. ఆయనకు అధికారం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర-2’ రాబోతోంది.

‘యాత్ర’ను రూపొందించిన మహి.వి.రాఘవే ఈ చిత్రాన్ని కూడా రూపొందించబోతున్నాడు. తమిళ నటుడు జీవా ఇందులో జగన్ పాత్ర పోషిస్తాడని.. కొన్ని సన్నివేశాల్లో వైఎస్‌గా మమ్ముట్టినే కనిపించబోతున్నాడని అంటున్నారు. ఐతే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో జగన్ మీద సినిమా తీయడం కరెక్టేనా.. ‘యాత్ర’ను రిసీవ్ చేసుకున్నట్లే దీన్ని కూడా జనాలు తీసుకుంటారా అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ‘యువి’ క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థ ప్రభాస్ ఆప్త మిత్రులైన వంశీ, ప్రమోద్‌, విక్కీలది అన్న సంగతి తెలిసిందే. ‘యువి’ని ప్రభాస్ సొంత సంస్థ లాగే చూస్తారు అందరూ. ఏపీ సీఎం జగన్‌తో ప్రభాస్ మిత్రులకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. వారిదీ జగన్ సామాజిక వర్గమే. కానీ వీరి బంధం గురించి ఇప్పటిదాకా బయటికి వెల్లడి కాలేదు. సినీ పరిశ్రమలో ఇలాంటి రాజకీయ బంధాలు బయట పడటం మంచిది కాదన్న ఉద్దేశంతో ఓపెన్ కారు.

ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు మారతాయో తెలియదు కాబట్టి.. ఇలా ఒక పార్టీ రంగు పూసుకుంటే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే తెర వెనుక ఎలాంటి బంధం ఉన్నా పైకి న్యూట్రల్‌గా కనిపించడానికి చూస్తారు. నిర్మాతలకు అయితే ఇది మరీ అవసరం. కానీ యువి వాళ్లు ఇప్పుడు ‘యాత్ర-2’ను నిర్మించడం ద్వారా వైసీపీ రంగును పులిమేసుకుంటున్నట్లే చెప్పాలి. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ వైసీపీ మద్దతుదారులుగా ముద్ర వేసుకుంటే.. ప్రభాస్‌కు సైతం కొంత ఆ రంగు అంటుకోవచ్చు. దీన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య వైసీపీ టికెట్ మీద నరసాపురంలో పోటీ చేస్తుందనే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. అదే నిజమైతే ప్రభాస్‌ను వైసీపీ మనిషిగా చూస్తారేమో జనాలు. ఇది మంచో చెడో కాలమే నిర్ణయించాలి. 

This post was last modified on July 2, 2023 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

47 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago