ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ప్రాజెక్ట్-కే’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించిన ప్రభాస్ హీరోగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రమిది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమా స్కేలే వేరుగా కనిపిస్తోంది. ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడే బడ్జెట్ రూ.500 కోట్లుగా చెప్పుకున్నారు.
కానీ సినిమా పూర్తయ్యేసరికి ఇంకో రెండొందల కోట్లు బడ్జెట్ పెరగొచ్చని తెలుస్తోంది. ఇటీవలే కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులోకి రావడంతో దీని మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా కమల్ చేయబోతోంది విలన్ పాత్ర అన్న ఊహాగానాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ప్రభాస్, కమల్ ఢీ అంటే ఢీ అని తలపడితే ఆ మజానే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
కాగా ఈ సినిమా కథాంశం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ కథ కాగా.. దీనికి ఫాంటసీ టచ్ కూడా ఉంటుందట. చెడు మీద మంచి విజయం సాధించడం అనే యూనివర్శల్ పాయింట్ ఆధారంగా సిినిమా తెరకెక్కుతోందని.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నడిచే కథ అంతా హాలీవుడ్ సినిమాలను తలపిస్తే.. దీనికి ఇచ్చిన ఫాంటసీ టచ్ ఇండియన్ మైథాలజీస్ను గుర్తు చేస్తుందని అంటున్నారు. ఈ రెంటినీ మిక్స్ చేసిన విధానమే సినిమాలో హైలైట్ అట.
అమితాబ్, ప్రభాస్, కమల్.. ఈ ముగ్గురూ ఇందులో శాస్త్రవేత్తలుగా కనిపించనుండగా.. ప్రభాస్ ఇందులో విష్ణువు అవతారంలోనూ కనిపించనున్నట్లుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ కథను మైథాలజీతో ముడిపెట్టిన క్రమంలో కనిపించే విష్ణువు అవతారాన్ని కూడా ప్రభాసే పోషించాడట. విష్ణువు అవతారంలో ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంటుందని.. ఇటీవలే ‘ఆదిపురుష్’లో రాముడిగా కనిపించినపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, విష్ణువుగా మాత్రం ప్రభాస్ మెప్పిస్తాడని అంటున్నారు.
This post was last modified on July 2, 2023 4:12 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…