ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ప్రాజెక్ట్-కే’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించిన ప్రభాస్ హీరోగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రమిది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమా స్కేలే వేరుగా కనిపిస్తోంది. ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడే బడ్జెట్ రూ.500 కోట్లుగా చెప్పుకున్నారు.
కానీ సినిమా పూర్తయ్యేసరికి ఇంకో రెండొందల కోట్లు బడ్జెట్ పెరగొచ్చని తెలుస్తోంది. ఇటీవలే కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులోకి రావడంతో దీని మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా కమల్ చేయబోతోంది విలన్ పాత్ర అన్న ఊహాగానాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ప్రభాస్, కమల్ ఢీ అంటే ఢీ అని తలపడితే ఆ మజానే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
కాగా ఈ సినిమా కథాంశం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ కథ కాగా.. దీనికి ఫాంటసీ టచ్ కూడా ఉంటుందట. చెడు మీద మంచి విజయం సాధించడం అనే యూనివర్శల్ పాయింట్ ఆధారంగా సిినిమా తెరకెక్కుతోందని.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నడిచే కథ అంతా హాలీవుడ్ సినిమాలను తలపిస్తే.. దీనికి ఇచ్చిన ఫాంటసీ టచ్ ఇండియన్ మైథాలజీస్ను గుర్తు చేస్తుందని అంటున్నారు. ఈ రెంటినీ మిక్స్ చేసిన విధానమే సినిమాలో హైలైట్ అట.
అమితాబ్, ప్రభాస్, కమల్.. ఈ ముగ్గురూ ఇందులో శాస్త్రవేత్తలుగా కనిపించనుండగా.. ప్రభాస్ ఇందులో విష్ణువు అవతారంలోనూ కనిపించనున్నట్లుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ కథను మైథాలజీతో ముడిపెట్టిన క్రమంలో కనిపించే విష్ణువు అవతారాన్ని కూడా ప్రభాసే పోషించాడట. విష్ణువు అవతారంలో ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంటుందని.. ఇటీవలే ‘ఆదిపురుష్’లో రాముడిగా కనిపించినపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, విష్ణువుగా మాత్రం ప్రభాస్ మెప్పిస్తాడని అంటున్నారు.
This post was last modified on July 2, 2023 4:12 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…