హాలీవుడ్ మూవీస్ లో ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో రాజమౌళి కూడా ఉన్నారు. మహేష్ బాబుతో చేయబోయే గ్లోబల్ మూవీకి స్ఫూర్తి ఈ సినిమానే. అడవుల్లో నిధులు, నిక్షేపాల కోసం ప్రమాదకరమైన గుహలు, జంతువులను దాటుకుని హీరోలు విజయం సాధించడమనే ఎన్నో చిత్రాలు దీని నుంచి స్ఫూర్తి పొందినవే. చిరంజీవి అంజి లాంటి ఎన్నో టాలీవుడ్ మూవీస్ లో వీటి రిఫరెన్సులు చూడొచ్చు. 1981లో మొదలైన ఈ సిరీస్ లో ఇప్పటిదాకా నాలుగు సినిమాలు వచ్చాయి. మొదటి మూడు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్, టెంపుల్ అఫ్ డూమ్, లాస్ట్ క్రూసేడ్ గొప్ప విజయం సాధించాయి. 2008లో వచ్చిన కింగ్ డం అఫ్ ది క్రిస్టల్ స్కల్ ఒకటే వీటి స్థాయిలో సక్సెస్ కాకపోయినా కమర్షియల్ గా హిట్టయ్యింది. మొన్న శుక్రవారం అయిదోది వచ్చింది. డయల్ అఫ్ డెస్టినీ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని ఇండియానా జోన్స్ ఫైనల్ పార్ట్ గా ప్రమోట్ చేశారు. దీంతో సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎంత వయసైనా సరే హారిసన్ ఫోర్డ్ ఇందులో కూడా ఉత్సాహంగా నటించడంతో అభిమానులు చాలా ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఇది నిరాశపరిచే ఫలితాన్ని అందుకుంది.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కాల ప్రయాణం చేసే ఒక డివైజ్ చుట్టూ దర్శకుడు జేమ్స్ మ్యాన్ గోల్డ్ దాన్ని చివరి దాకా ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఈజీగా ఊహించే మలుపులతో పాటు వయసైపోయిన హారిసన్ చేసే సాహసాలు అంత థ్రిల్లింగ్ గా లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా బాగుందని చెప్పడానికి అవి సరిపోలేదు. జక్కన్న ఇటీవలే హైదరాబాద్ లో దీని షో చూశారు. ఎలాగూ ఇండియానా జోన్స్ ముగిసిపోయింది కాబట్టి జక్కన్న మహేష్ ల కలయికలో రాబోతున్న ఈ జానర్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడం ఖాయం.
This post was last modified on July 1, 2023 11:11 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…