Movie News

బిడ్డను కన్నాక కాజల్ బాధ

సెలబ్రెటీలు చాలా ఆరోగ్యంగా, హుషారుగా కనిపిస్తారు కానీ.. వాళ్లను కూడా శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతుంటాయి. పైకి మామూలుగా కనిపిస్తున్నా.. లోలోన వాళ్లు బాధ పడుతుంటారు. దీపికా పదుకొనే లాంటి వాళ్లు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వరకు వెళ్లిన విషయం వెల్లడైనపుడు అందరూ షాకయ్యారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. కూడా డిప్రెషన్ ఎదుర్కొన్న విషయం ఆలస్యంగా వెల్లడైంది. బిడ్డకు జన్మనిచ్చాక కొందరు ఎదుర్కొనే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ను కాజల్ కూడా ఎదుర్కొందట. అతి కష్టం మీద తాను ఆ సమస్యను అధిగమించినట్లు తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించింది చందమామ.

‘‘అవును.. నేను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎదుర్కొన్నా. కానీ అది మామూలు విషయమే. చాలామందికి ఎదురయ్యే సమస్యే. మహిళలు ఎవరైనా ఈ డిప్రెషన్ ఎదుర్కొంటుంటే కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలి. మహిళలు సైతం పిల్లలు పుట్టాక తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కవుట్లు చేయడం.. ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం.. చిన్న చిన్న పనులుు చేయడం ద్వారా ఆ దశను దాటవచ్చు.

నేను ఈ పనులన్నీ చేశా. పైగా నన్ను ఎంతగానో అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల నేను ఆ దశ నుంచి బయటికి రాగలిగాను. నేను ఆ దశను ఎదుర్కొన్నపుడు నా భర్త గౌతమ్ చాలా బాధ పడ్డాడు’’ అని కాజల్ తెలిపింది. తన స్నేహితురాలు తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆ సిరీస్ చూశానని, తమన్నా అద్భుతంగా నటించిందని, ఆమెను చూస్తే తనకు భయం కలిగిందని కాజల్ చెప్పడం విశేషం.

This post was last modified on July 1, 2023 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

23 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

56 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago