సెలబ్రెటీలు చాలా ఆరోగ్యంగా, హుషారుగా కనిపిస్తారు కానీ.. వాళ్లను కూడా శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతుంటాయి. పైకి మామూలుగా కనిపిస్తున్నా.. లోలోన వాళ్లు బాధ పడుతుంటారు. దీపికా పదుకొనే లాంటి వాళ్లు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వరకు వెళ్లిన విషయం వెల్లడైనపుడు అందరూ షాకయ్యారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. కూడా డిప్రెషన్ ఎదుర్కొన్న విషయం ఆలస్యంగా వెల్లడైంది. బిడ్డకు జన్మనిచ్చాక కొందరు ఎదుర్కొనే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ను కాజల్ కూడా ఎదుర్కొందట. అతి కష్టం మీద తాను ఆ సమస్యను అధిగమించినట్లు తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించింది చందమామ.
‘‘అవును.. నేను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎదుర్కొన్నా. కానీ అది మామూలు విషయమే. చాలామందికి ఎదురయ్యే సమస్యే. మహిళలు ఎవరైనా ఈ డిప్రెషన్ ఎదుర్కొంటుంటే కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలి. మహిళలు సైతం పిల్లలు పుట్టాక తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కవుట్లు చేయడం.. ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం.. చిన్న చిన్న పనులుు చేయడం ద్వారా ఆ దశను దాటవచ్చు.
నేను ఈ పనులన్నీ చేశా. పైగా నన్ను ఎంతగానో అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల నేను ఆ దశ నుంచి బయటికి రాగలిగాను. నేను ఆ దశను ఎదుర్కొన్నపుడు నా భర్త గౌతమ్ చాలా బాధ పడ్డాడు’’ అని కాజల్ తెలిపింది. తన స్నేహితురాలు తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆ సిరీస్ చూశానని, తమన్నా అద్భుతంగా నటించిందని, ఆమెను చూస్తే తనకు భయం కలిగిందని కాజల్ చెప్పడం విశేషం.
This post was last modified on July 1, 2023 5:25 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…