ఒక పెద్ద హీరో సరసన చేసిన నటించిన సినిమా సూపర్ హిట్ అయితే.. ఆ హీరోయిన్కు అవకాశాలు వెల్లువెత్తాలి. కానీ మలయాళ భామ హనీ రోజ్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై పెద్ద హిట్ అయిన ‘వీరసింహారెడ్డి’లో ఆమె ఒక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కూడా ఓ కథానాయికగా నటించినప్పటికీ.. ఆ సినిమా రిలీజ్ ముంగిట అందరి దృష్టినీ ఆకర్షించింది హనీనే.
ప్రి రిలీజ్ ఈవెంటే కాక.. హనీ పాల్గొన్న వేరే కార్యక్రమాల్లో కూడా ఆమె క్రేజ్ చూసి అందరూ షాకయ్యారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఈమెకు ఈ క్రేజ్ ఏంట్రా బాబూ అనుకున్నారు సోషల్ మీడియా జనాలు. ‘వీరిసింహారెడ్డి’ హిట్టయితే అమ్మడిని ఆపడం కష్టం అనుకున్నారు. కానీ ఆ సినిమా వచ్చి ఆరు నెలలు కావస్తున్నా తెలుగులో హనీకి ఇంకో ఛాన్స్ రాలేదు.
హనీ వయసు కొంచెం ఎక్కువ కావడం, ట్రెండీగా అనిపించకపోవడం మైనస్ అవుతుండొచ్చేమో. ఆమెది 18 ఏళ్ల కెరీర్ కావడం విశేషం. 2005లోనే ఆమె కథానాయిక అయింది. తెలుగులోనూ ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే చిన్న సినిమాల్లో నటించింది గతంలో. ఐతే అప్పుడు ఆమెకు ఎలాంటి గుర్తింపూ రాలేదు. బాలయ్య లాంటి పెద్ద హీరోతో జోడీ కట్టడంతో తన పేరు మార్మోగింది. ఆమె హాట్ లుక్స్ యువతను కూడా బాగానే ఆకట్టుకున్నాయి.
సోషల్ మీడియాలో తన ఫొటోలు ట్రెండ్ అయ్యాయి. దీనికి తోడు సినిమా కూడా హిట్టయింది. అయినా ఎందుకో హనీని ఏ దర్శకుడూ, నిర్మాతా తమ సినిమాల్లో కన్సిడర్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. యంగ్ హీరోల పక్కన ఆమె సూట్ కాకపోవచ్చు కానీ.. సీనియర్లకు ఎలాగూ హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి వాళ్లకు అయినా జోడీగా తీసుకుంటారేమో చూడాలి.
This post was last modified on July 1, 2023 2:41 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…