నిన్న రిలీజైన స్పైకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. టాక్స్, రివ్యూస్ ఎలా ఉన్నా బక్రీద్ సెలవును పూర్తిగా వాడుకుంది ఒక్క నిఖిల్ మాత్రమే. మొదటి రోజు 11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే షేర్ ఏడు కోట్ల దాకా తేలుతుంది. ముప్పై శాతానికి పైగా రికవరీ ఫస్ట్ డేనే జరిగిపోయింది. అయితే ఈ జోరు మొదటి వీకెండ్ మొత్తం కొనసాగిస్తేనే బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఇవాళ్టి నుంచే లెక్కలో తగ్గుదల కనిపిస్తోంది. బిసి సెంటర్స్ లో డ్రాప్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా తేలాలంటే ఈ ఆదివారం గడవాలి.
కాసేపు ఈ కలెక్షన్లు పక్కనపెడితే నిఖిల్ మార్కెట్ స్టామినా ఎంత పెరిగిందో స్పై చూపించింది. కంటెంట్ ఎలా ఉందో పక్కాగా తెలియక ముందే ఆడియన్స్ తన సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చిన సామజవరగమనకు ఈ స్థాయిలో రెస్పాన్స్ కనిపించడం లేదు. పికప్ స్లోగా ఉంది. మల్టీప్లెక్సుల షోలు మెల్లగా ఫుల్ అవుతున్నాయి. ఒకవేళ స్పై కనక యునానిమస్ గా బాగుందని పబ్లిక్ టాక్ తెచ్చుకుని ఉంటే దాదాపు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన పనుండేది కాదు. కానీ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు
ఇకపై నిఖిల్ మరింత జాగ్రత్తగా ఉండాలి. రామ్ చరణ్ నిర్మాతగా ఇండియా హౌస్ , చరిత్రాత్మక బ్యాక్ డ్రాప్ తో స్వయంభు లాంటి ప్రాజెక్టులు కుర్ర హీరోలకు అంత సులభంగా వచ్చేవి కాదు. కార్తికేయ 2 తాలూకు సక్సెస్ ప్రభావం ఆ స్థాయిలో నిలిచింది కాబట్టే మధ్యలో వచ్చిన 18 పేజెస్ యావరేజ్ అయిన సంగతిని కనీసం ఎవరూ గుర్తించుకోలేదు. మినిమమ్ గ్యారెంటీ స్టేజిని ఎప్పుడో దాటేసిన నిఖిల్ ఇకపై తనమీద పెరుగుతున్న బడ్జెట్ లను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ శ్రద్ధ ఉంది కాబట్టే ఆ మధ్య గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినా భయపడలేదు. ఈ ప్లానింగ్ ఇకపై కూడా కొనసాగాలి
This post was last modified on July 1, 2023 8:24 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…