గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోషల్ మీడియాలో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఐతే ఎక్కువగా ట్విట్టర్లో వివాదాలు, ఆరోపణలు, వాదోపవాదాలతోనే ఆమె ట్రెండ్ అవుతూ ఉంటుంది. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఆమె వైరముత్తు లాంటి వ్యక్తుల మీద అలుపెరగని పోరాటం చేస్తోంది. అలాగే సెలబ్రెటీలే కాక మామూలు అమ్మాయిలకు కూడా ఎక్కడైనా లైంగిక వేధింపులు ఎదురైనట్లు వార్తలు వస్తే.. వాటి మీద చిన్మయి స్పందిస్తూ ఉంటుంది.
ఐతే కొన్నిసార్లు ఆమె అభిప్రాయాలు, వాదనలు విడ్డూరంగా ఉంటాయంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుంటారు. ఎప్పుడూ మహిళల కోణంలోనే ఆమె మాట్లాడుతుందని.. మగాళ్లందరూ చెడ్డవాళ్లన్నట్లు వాదిస్తుందని ఆమెను టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ను ట్యాగ్ చేసి ఆమెను అదుపులో పెట్టుకోమని.. కౌన్సెలింగ్ ఇవ్వమని నెటిజన్లు పోస్టులు పెడుతుంటారు.
ఇటీవల ఈ రకమైన దాడి ఎక్కువైపోవడంతో రాహుల్ రవీంద్రన్.. నెటిజన్లకు ఒక అప్పీల్ ఇస్తూ పోస్టు పెట్టాడు. ‘‘ఆమెతో గొడవ పడ్డాక నన్ను ట్యాగ్ చేసే అబ్బాయిలందరికీ ఒక విన్నపం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె లేవనెత్తే సమస్యల గురించి విశాల దృక్పథంతో ఆలోచించండి. మీరు ఆమెతో ఏకీభవించవచ్చు. లేదా వ్యతిరేకించవచ్చు. కానీ ముందు ఆమె చెప్పేది వినండి. ఆమెకు మీరు ప్రేమను ఇస్తే.. తిరిగి మరింత ప్రేమనే పంచుతుంది.
మీకు చాలా ఇష్టమైన అక్కలా ఉంటుంది. లిమిట్ లేకుండా ప్రేమిస్తది. సమస్యలను మీరు వేరే కోణంలో చూడటం మొదలుపెడితే.. ఇందుకోసం చిన్న ఎఫర్ట్ పెడితే మీ జీవితంలో ఉన్న మహిళలు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తారు. మీ మీద మునుపటి కంటే గౌరవం చూపిస్తారు. దీని వల్ల మీ ప్రపంచం ఎంత సంతోషంగా మారుతుందో మీరు ఊహించలేరు’’ అని రాహుల్ రవీంద్రన్ పోస్ట్ పెట్టాడు. కొందరు ఈ పోస్ట్ పట్ల సానుకూలంగా స్పందిస్తుండగా.. కొందరు మాత్రం భార్యను వెనకేసుకు వస్తున్నావా అంటూ అతణ్ని టార్గెట్ చేస్తున్నారు.
This post was last modified on June 30, 2023 2:13 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…