యువ కథానాయకుడు శ్రీ విష్ణు చివరి సినిమా ‘అల్లూరి’ పెద్ద డిజాస్టర్. అంతకుముందు అతడి నుంచి వచ్చిన భళా తందనాన, అర్జున ఫల్గుణ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. వరుసగా మూడు డిజాస్టర్లు ఇచ్చిన హీరో నుంచి వచ్చే తర్వాతి సినిమా మీద ఏమాత్రం బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘సామజవరగమన’ పేరుతో శ్రీ విష్ణు సినిమా చేస్తున్నాడన్న విషయం వెల్లడైనపుడు ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ‘వివాహ భోజనంబు’తో దర్శకుడిగా పరిచయం అయిన రామ్ అబ్బరాజు రూపొందించిన సినిమా ఇది. విడుదలకు కొన్ని రోజుల ముందు వరకు కూడా సినిమాకు అంతగా హైప్ లేదు. కానీ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో రిలీజ్కు రెండు మూడు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేసింది చిత్ర బృందం. అది బాగానే పని చేసింది.
ముందే పాజిటివ్ టాక్, రివ్యూలు బయటికి రావడంతో తొలి రోజు మంచి బజ్తోనే సినిమా రిలీజైంది. ఇక గురువారం రిలీజ్ తర్వాత కూడా మంచి టాకే వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కూడా పరిస్థితులు కూడా బాగానే కలిసొచ్చి సూపర్ హిట్, బ్లాక్బస్టర్ రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది. గతవారం చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. అంతకుముందు వారం వచ్చిన ‘ఆదిపురుష్’ కథ ముగిసింది. ఇక ఈ వారం పోటీగా వచ్చిన ‘స్పై’ డివైడ్ టాక్ తెచ్చుకుంది.
వేరే రిలీజ్ల గురించి జనాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. రివ్యూలన్నీ కూడా 3కి అటు ఇటు రేటింగ్తో రావడంతో జనాల్లో సినిమా మీద పూర్తి సానుకూల భావన ఏర్పడింది. సినిమా చూసిన వాళ్లందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సినిమాలోని ‘జెర్సీ’ మూమెంట్ తరహా సీన్లకు సంబంధించిన థియేటర్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే లో బజ్తో మొదలైన ‘సామజవరగమన’ కాస్తా అన్నీ కలిసొచ్చి పెద్ద హిట్ దిశగా దూసుకెళ్తోంది.
This post was last modified on June 30, 2023 2:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…